ఈవారం బాక్సాఫీసు ఖాళీ!

సెప్టెంబ‌రు 15న రావాల్సిన స్కంధ‌… నెలాఖ‌రుకి వాయిదా ప‌డ‌డంతో.. ఈవారం బాక్సాఫీసు అనూహ్యంగా ఖాళీ అయిపోయింది. ఒక‌ట్రెండు సినిమాలు మిన‌హా.. పెద్ద‌గా ఆక‌ర్షించే విష‌యాలేం లేవు. విశాల్ మార్క్ ఆంటోనీ, ర‌వితేజ నిర్మాత‌గా తెర‌కెక్కించిన ఛాంగురే బంగారు రాజా.. రెండు సినిమాలు బాక్సాఫీసు బ‌రిలో నిలిచాయి. ఛాంగురే.. వ‌చ్చే నెల‌లో రావాల్సింది. స్కంద వాయిదా ప‌డ‌డంతో.. ముందుకొచ్చేసింది. విశాల్.. రిలీజ్‌డేట్ ముందే ఫిక్స‌య్యింది. సోమ‌వారం వినాయ‌క చ‌వితి. ఈ పండ‌గ‌ను… విశాల్ సినిమా క్యాష్ చేసుకొనే అవ‌కాశం ఉంది. గ‌త‌వారం విడుద‌లైన మిస్ శెట్టి- మిసెస్ పోలిశెట్టికి ఈ వారం కూడా క‌లిసొచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా `ప‌ఠాన్‌`కి మ‌రో వీకెండ్ దొరికిన‌ట్టైంది. తెలుగు రాష్ట్రాల‌లో ప‌ఠాన్‌కి మంచి వ‌సూళ్లే దక్కుతున్నాయి. చాలా ఏరియాల్లో అనుష్క సినిమా కంటే.. ప‌ఠాన్‌కే ఎక్కువ టికెట్లు తెగుతున్నాయి. ఈ వారం కూడా అదే జోరు కొన‌సాగే అవ‌కాశాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీ ప్రెస్‌మీట్లు పెట్టకపోవడానికి మీడియానే కారణం !

మోదీ గత పదేళ్లకాలంలో ఒక్క సారే ప్రెస్ మీట్ పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిపోయిన తర్వాత అమిత్ షాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్ లో...

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను ఇప్పుడెవరు పట్టించుకుంటారు !?

పేదలకు వైద్యం ఆపేస్తామని ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఏపీలోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తమకు...

125 సీట్లు వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ !?

బీజేపీ 250 సీట్లు సాధించినా కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు సాధించినా ఒకటేనని.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఎలా సాధ్యమంటే.. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు మద్దతిస్తాయి...

సెఫాలజిస్టులందరి మాట టీడీపీ కూటమే !

దేశంలో అగ్రశ్రేణి సెఫాలజిస్టులు అందరూ ఏపీలో టీడీపీ కూటమే గెలుస్తుందని విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎప్పటి నుంచో తన వాదన వినిపిస్తున్నారు. ఏపీలో విస్తృతంగా పర్యటించి ఇంటర్యూలు చేసి వెళ్లిన ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close