తుమ్మలను చేర్చుకున్నారు – షర్మిలను పంపేశారు !

కాంగ్రెస్ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు చేరారు. ఆయనకు కండువా కప్పి ఖర్గే పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు ఉదయమే ఆయన బీఆర్ఎస్ పార్టకి రాజీనామా చేశారు. అయితే షర్మిలను మాత్రం పార్టీలో చేర్చుకోలేదు. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను షర్మిల కలిసినట్లుగా ప్రచారం జరిగింది. పార్టీని విలీనం చేసే విషయంలో ఏం చేయాలన్నదానిపై చర్చించినట్లుగా చెబుతున్నారు. ఒక రోజు ముందు డీకే శివకుమార్ నూ కలిశారు.

ఎవరి దగ్గర నుంచి కూడా హామీ లభించకపోవడంతో షర్మిల నిరాశగా వెనుదిరిగినట్లుగా చెబుతున్నారు. ఈ సారికి షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకునే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. షర్మిలను చేర్చుకునే విషయంలో తెలంగాణ నేతలు ఏ మాత్రం ఆసక్తిగా లేరు. అసలు వద్దే వద్దని వాదిస్తున్నారు. ఆమెను తెలంగామలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉపయోగించుకోవాలనుకున్న హైదరాబాద్‌లో చేరిక ప్రోగ్రాం వద్దని తేల్చినట్లుగా చెబుతున్నారు. దీంతో షర్మిల చేరికను హైకమాండ్ పక్కన పెట్టినట్లుగా చెబుతున్నారు.

షర్మిల పరిస్థితి ఎటూ కాకుండా పోతోంది. అటు ఆమె సొంత పార్టీ కార్యక్రమాలను నిర్వహించలేకపోతున్నారు. ఇటు కాంగ్రెస్ లో చేరికపై స్పష్టత లేదు. ఎలా చూసినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీకి షర్మిలకు అవకాశం దొరకదు. ఇప్పుడు షర్మిల ఏం చేస్తారన్నది కీలకంగా మారింది. ఆమె పార్టీ ద్వారా పాలేరులో పోటీ చేసినా కనీసం మూడు, నాలుగు శాతం కూడా ఓట్లు రావని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విశ్వ‌క్‌సేన్ కోసం బాల‌య్య‌

నంద‌మూరి హీరోలంటే విశ్వ‌క్‌సేన్‌కు ప్ర‌త్యేక‌మైన అభిమానం. ఎన్టీఆర్‌కు విశ్వ‌క్ వీరాభిమాని. ఎప్పుడు ఎన్టీఆర్ ప్ర‌స్తావన వ‌చ్చినా, ఊగిపోతాడు. బాల‌కృష్ణ‌తో కూడా మంచి అనుబంధ‌మే ఉంది. విశ్వ‌క్‌సేన్ గ‌త చిత్రానికి ఎన్టీఆర్ గెస్ట్ గా...
video

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ ట్రైల‌ర్‌: ఇది మ‌రో ర‌కం సినిమా

https://youtu.be/UY31pDh055o?si=kVsguDvBSdE7xJ5Y 'మాస్ కా దాస్' అనే ట్యాగ్ లైన్‌కి త‌గ్గ‌ట్టుగా సినిమాలు చేసుకొంటూ వెళ్తున్నాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న నుంచి వ‌స్తున్న మ‌రో పూర్తి స్థాయి మాస్‌, మ‌సాలా, పొలిటిక‌ల్ ధ్రిల్ల‌ర్‌... 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి'....

బీఆర్ఎస్ ను బుక్ చేసిన సీబీఐ మాజీ జేడీ..!?

ఏపీకి రాజధాని లేకపోవడంతో మరో పదేళ్లు హైదరబాద్ నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ డిమాండ్ పట్ల బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల...

పెళ్లి గేమ్‌లో పాండ్యా హిట్ వికెట్ అయ్యాడా ? తెలివిగా తప్పించుకున్నాడా ?

క్రికెటర్ హార్జిక్ పాండ్యా ఇప్పుడు హాట్ టాపిక్. ముంబైకి కెప్టెన్ గా ఆయన భయంకరమైన ట్రోల్స్ ఎదుర్కొన్నారు. అదే సమయంలో ముంబై టాప్ ఫోర్ కు చేరుకోలేకపోయింది. ఆ షాక్‌లో ఉండగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close