ఆహా ఒరిజినల్ సిరీస్ ‘పాపం పసివాడు’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన డైరెక్టర్ సందీప్ రాజ్ … సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్

పాపులర్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆహా నుంచి ‘పాపం పసివాడు’*అనే కామెడీ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను పలకరించుంది. ఈ ఒరిజినల్‌ను *వీకెండ్ షో రూపొందించింది. ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తే ఈ రొమాంటిక్ కామెడీ ట్రైలర్‌ను దర్శకుడు సందీప్ రాజ్ రిలీజ్ చేశారు. ఈ ఐదు ఎపిసోడ్స్ ఉన్న ఫన్ రైడర్ సెప్టెంబర్ 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

‘పాపం పసివాడు’సిరీస్‌లో టాలెంటెడ్ సింగర్ శ్రీరామ చంద్ర*తో పాటు *గాయత్రి చాగంటి, రాశీ సింగ్, శ్రీవిద్య మహర్షి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. ఇందులో మన కథానాయకుడు శ్రీరామ చంద్ర పాతికేళ్ల క్రాంతి అనే కుర్రాడి పాత్రలో అలరించబోతున్నారు. అతను నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తుంటాడు. అతని హృదయం ప్రేమ కారణంగా బద్దలై ఉంటుంది. అలాంటి తరుణంలో అతన్ని ఒకరు ఇద్దరు కాదు… ఏకంగా ముగ్గురు అమ్మాయిలు ప్రేమిస్తారు.

డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ, ‘‘పాపం పసివాడు ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్ కావటం ఎంతో ఆనందంగా అనిపించింది. ప్రేమ, కామెడీ కాంబోలో సాగే ఈ సిరీస్ ప్రేక్షకులకు ఓ రోలర్ కోస్టర్‌లా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నాను. కచ్చితంగా ప్రేక్షకులకు ఈ సిరీస్ ఓ అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఎంటైర్ టీమ్‌కి అభినందనలు”, అన్నారు.

ప్లే బ్యాక్ సింగర్‌గా శ్రీరామ చంద్ర తన వైవిధ్యాన్ని ఎప్పుడో చాటుకున్నారు. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా ఆహాలో రూపొందిన ‘పాపం పసివాడు’సిరీస్ గురించి మాట్లాడుతూ, ‘‘ఆహాతో నేను కలిసి పని చేయటం ఇది మూడోసారి. యాంకర్‌గా ఇక్కడ నా జర్నీ ప్రారంభమైంది. ఇప్పుడు పాపం పసివాడు సిరీస్‌తో యాక్టర్‌గా మారాను. ఇది ఓ వైపు ప్రేమ మరో వైపు కామెడీ కలయికతో సాగే ఒరిజినల్. చాలా మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చేశాను. సెప్టెంబర్ 29న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌ను ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు”, అన్నారు

సెప్టెంబర్ 29 నుంచి ఆహాలో ‘పాపం పసివాడు’ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అందమైన ప్రేమ కథతో పాటు ఆకట్టుకునే భావోద్వేగాలు, ఎంటైర్‌టైన్‌మెంట్ ఇందులో మిళితమై ఉంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బటన్ నొక్కి లబ్దిదారుల నోట్లో మట్టి – డబ్బుల్లేవా ?

పోలింగ్ కు రెండు రోజుల ముందు లబ్దిదారుల ఖాతాల్లో రూ. 14వేల కోట్లు వేసేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ డబ్బులు జమ చేయడం లేదు. ఇదిగో అదిగో అంటూ ...

హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్…ఎందుకంటే..?

జూనియర్ ఎన్టీఆర్ తన ల్యాండ్ కు సంబంధించి వివాదం తలెత్తడంతో హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉన్న ప్లాట్ విషయంలో ఈ వివాదం తలెత్తింది. 2003లో గీత లక్ష్మీ అనే...

సరైన ఏర్పాట్లు ఉంటే ఏపీలో 90 శాతం పోలింగ్ !

దేశంలో అత్యధిక రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 82 శాతం వరకూ పోలింగ్ నమోదయింది. అంతా పెద్ద పెద్ద క్యూలైన్లు ఉండటాన్ని గొప్పగా చెబుతున్నారు. కానీ పోలింగ్ పర్సంటేజీ...

ఇసుక మాఫియాకు సుప్రీంకోర్టు లెక్కే కాదు !

ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశిస్తోంది. కానీ ఎప్పటికప్పుడు మాఫియా మాత్రం అబ్బే ఇసుక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close