లిక్కర్ స్కామ్‌లో కవిత నెంబరూ ఉందంటున్న బీజేపీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత నంబర్ కూడా వస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హెచ్చరించారు. ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చి నఆయన లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియానే విడిచిపెట్టలేదని గుర్తు చేశారు. కవితను ఎలా విడిచిపెడతామంటూ ఆయన ప్రశ్నించారు. కవిత పేరు ఢిల్లీ లిక్కర్ కేసులో ఉందన్నారు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్‌ భావిస్తున్నారన్నారు. జాతీయ రాజకీయాలు కేసీఆర్ చేద్దామనుకుంటే.. లిక్కర్ కేసులో కవిత జాతీయ స్థాయి వార్తల్లో నిలిచారంటూ ఎద్దేవా చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొదట బయటపడినప్పుడు అనురాగ్ ఠాకూరే.. ఎక్కువగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు. సౌత్ లాబీ నుంచి కవిత కీలక పాత్ర పోషించారని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. చార్జిషీట్లు దాఖలు చేశాయి. మిగతా నిందితులు అందర్నీ అరెస్టు చేశారు. కానీ కవితను అరెస్టు చేయలేదు. సౌత్ లబీ నుంచి అందరూ అప్రూవర్లుగా మారారు. ఒక్క కవిత మాత్రమే నిందితురాలిగా ఉన్నారు. ఆమె తనపై విచారణ జరగకుండా.. ఈడీ విచారణకు పిలవకుండా.. సుప్రీంకోర్టుకు వెళ్లి రెండు నెలల పాటు రిలీఫ్ తెచ్చుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈ కేసు విచారణ ఆగింది. నవంబర్ నెలలోనే కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయనకు ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ కేజ్రీవాల్ విచారణకుహాజరు కాలేదు. అయననూ అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ.. కవితను అరెస్టు చేయకపోవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందమన్న ప్రచారం జరుగుతోంది. అయితే అది ఎన్నికల ఫలితాలను బట్టి ఉండొచ్చని ఠాకూర్ మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ సోషల్ మీడియా దుకాణ్ బంద్ !

పోలింగ్ సరళితోనే వైసీపీ దుకాణ్ బంద్ చేసింది. పోలింగ్ ముగిసిన తరవాత రోజే ఐ ప్యాక్ సిబ్బందిని మెడపట్టి బయటకు గెంటేశారు. రిషిరాజ్ సింగ్ నేతృతవంలో ఉన్న ఐ ప్యాక్ సేవలు ఇక...

విషాదం… పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం..

ఎన్నికల్లో ఓటేసి ఉత్సాహంతో సొంతూరు నుంచి బయల్దేరిన వారిని ఊహించని ప్రమాదం వెంటాడింది. ఎంచక్కా కబుర్లతో కొద్ది గంటల్లోనే గమ్యస్థానాలకు చేరుకుంటామని ఆనందోత్సాహాలతో గడుపుతోన్న వారిని మృత్యువు పలకరించింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే...

డైవర్ట్ ఓటు…కాంగ్రెస్ కు శాపంగా మారనుందా..?

ఎంపీ ఎన్నికల పోలింగ్ తర్వాత ఎలాంటి ఫలితాలు రానున్నాయని కాంగ్రెస్ డిస్కషన్ స్టార్ట్ చేసింది. ఏ నియోజకవర్గాల్లో ఎంతమేర పోలింగ్ నమోదైంది..? అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారా..? టఫ్ కాంపిటేషన్ ఉన్న...

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close