సీపీఐకి ఒక్క సీటిచ్చి పొత్తు ఖరారు చేసుకున్న రేవంత్

కమ్యూనిస్టుల్లో ప్రధానమైన సీపీఐతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తో పొత్తు ఖరారు చేసుకున్నారు. ఒక్కటంటే ఒక్క సీటు ఇచ్చి సీపీఐని కన్విన్స్ చేశారు. రెండు సీట్లు కోసం పట్టుబడుతూ వచ్చిన ఆ పార్టీ చివరికి కొత్తగూడెం ఇస్తే చాలనుకుని సర్దుకుంది. నిజానికి కొత్తగూడెంకు కూడా కాంగ్రెస్ తరపున ఓ అభ్యర్థి రెడీగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరేందుకు జలగం వెంకట్రావు రెడీగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవాలనుకుంది. అందుకే ఆయనకు రెడ్ సిగ్నల్ ఇచ్చి… సీపీఐతో పొత్తు ఖరారు చేసుకుంది.

చెన్నూరు సీటును కూడా ఇవ్వాలని పట్టుబట్టింది. ముందుగా కాంగ్రెస్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ బీజేపీ నుంచి మాజీ ఎంపీ వివేక్ వచ్చి చేరడంతో ఆయనకు లేదా ఆయన కుమారుడికి టిక్కెట్ ఖరారు చేస్తున్నారు. దాంతో ఆ సీటు సీపీఐకి కాకుండా పోయింది. ఎన్నికల్లో గెలిచినాక రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఏదో ఒకటిలే అని సీపీఐ సర్దుకుపోయింది. కానీ సీపీఎం మాత్రం తగ్గడం లేదు. ఒక్క స్థానానికి అంగీకరించకపోవడంతో.. ఆ పార్టీని నేతలు పట్టించుకోలేదు. మిర్యాలగూడ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఆలోచిస్తూండటంతో సీపీఎం కాంగ్రెస్ ను బెదిరిస్తున్నట్లుగా అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.

సీపీఎంను కూడా ఒక్క సీటుకు ఒప్పించి.. మిర్యాలగూడతో సరి పెట్టే ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ చేస్తోంది. ఎంత వరకూ అంగీకరిస్తారో కానీ.. సీపీఎం కన్నా సీపీఐనే బలమైన పార్టీ. అయితే రెండు కమ్యూనిస్టు పార్టీలు కలిస్తేనే ఓ మూడు, నాలుగు శాతం ఓట్లు కలిసి వస్తాయన్న అంచనా ఉంది. అదీ కూడా కొన్ని సెలక్టివ్ నియోజకవర్గాల్లోనే. మొత్తంగా రేవంత్ కోదండరాంతో చర్చలు జరిపి ఆ పార్టీ మద్దతు ప్రకటింపచేసుకున్నారు. షర్మిల పార్టీని దూరం పెట్టినా ఆపార్టీ మద్దతు పొందారు. ఒక్క సీటు ఇచ్చి కమ్యూనిస్టుల మద్దతూ పొందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close