కొడంగల్‌లో ఈ సారి రేవంత్ ను ఆపగలరా !?

కొడంగల్‌ నియోజకవర్గం హాట్‌ టాఫిక్‌గా మారింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి రెండు సార్లు గెలిచి ఓ సారి ఓడిపోయారు. గత ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డి గెలిచారు. ఆయనను గెలిపించేందుకు ఎక్కువ దృష్టి పెట్టి తాను ఓడిపోయారు పట్నం మహేందర్ రెడ్డి. దీంతో ఆయన రాజకీయ జీవితానికి మసక పడింది. చివరికి ఆయనకు మూడు నెలల ముందుగా మంత్రి పదవి ఇచ్చి సర్దుబాటు చేశారు. కానీ ఆయన తీరు మాత్రం కాస్త సందేహాస్పదంగానే ఉంది.

కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ సీఎం అభ్యర్థి అనే ప్రచారం ఉంది కాబట్టి… రేవంత్ రెడ్డిపై ఈ సారి గతంలోలా దూకుడుగా వెళ్లాలని ఆయన అనుకోవడం లేదు. అందుకే గతంలోలా ప్రయత్నాలు చేయడం లేదన్న వాదన వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి కొడంగల్ పై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఆయన నామినేషన్ కోసం ప్రతి ఊరి నుంచి జనం తరలి వచ్చారు. అయితే రేవంత్ ను ఓడించడానికి తెలంగాణ భవన్ లో ప్రత్యేక వార్ రూమ్ ను బీఆర్ఎస్ హైకమాండ్ ను పెట్టింది. అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎప్పుడు ఏం చేయాలో అక్కడ్నుంచే దిశానిర్దేశం చేస్తున్నారు. సొంత రాజకీయం వద్దని చెప్పినట్లు చేయాలని సూచనలు వెళ్లాయి.

గత ఎన్ని కల్లో గెలవడానికి ఎన్నో చెప్పిన నరేందర్ రెడ్డి, కేటీఆర్ ఐదేళ్లలో అసలు పట్టించుకోకపోవడం… రేవంత్ కు కలసి వస్తోదంి. అదే సమయంలో సీనియర్‌ నాయకులు గురునాథ్‌రెడ్డి హస్తం గూటికి చేరడంతో కొడంగల్‌లో కాంగ్రెస్‌కు మరింత బలం ఇచ్చింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం ఆయన పని చేశ ారు. గురునాథ్‌ రెడ్డి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొడంగల్‌ నియోజకవర్గంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ అభ్యర్థుల గెలుపోటముల్లో గురునాథ్‌రెడ్డి కీలకం కానున్నారు. దాంతో విజయంపై కాంగ్రెస్‌ ధీమాగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close