మార్ఫింగ్ భూతం… ఒక్క‌ట‌వుతున్న చిత్ర‌సీమ‌

పైర‌సీలా… మార్ఫింగ్ కూడా ఓ భూతంలా మారుతోంది. తాజాగా ర‌ష్మిక వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో మార్ఫింగ్ ఏ స్థాయిలోకి చేరిందో అంద‌రికీ అర్థ‌మైంది. దీన్నుంచి చిత్ర‌సీమ‌నీ, క‌థానాయిక‌ల ఇమేజ్‌నీ కాపాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంద‌రూ గుర్తిస్తున్నారు. అందుకే ఒకొక్క‌రుగా నోరు విప్పుతున్నారు. ర‌ష్మిక విష‌యంలో అన్యాయం జ‌రిగింద‌ని అమితాబ్ బ‌చ్చ‌న్ సైతం వ్యాఖ్యానించ‌డం ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంది. ఆ త‌ర‌వాత నిర్మాత‌లు, హీరోలు, ద‌ర్శ‌కులూ ఒకొక్క‌రుగా త‌మ సంఘీభావం వ్య‌క్తం చేస్తూ వ‌చ్చారు. విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా గొంతు విప్పాడు. ఈ విష‌యాన్ని అంద‌రూ సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని, త‌క్ష‌ణం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, మ‌రో అమ్మాయి మార్ఫింగ్ తో బాధ ప‌డ‌కూడ‌ద‌ని హిత‌వు ప‌లికాడు. హీరోయిన్లంతా క‌లిసి క‌ట్టుగా ఉండాల్సిన స‌మ‌యం ఉంది. ఎందుకంటే మార్ఫింగ్ వ‌ల్ల వాళ్ల‌కే ఎక్కువ డామేజీ జ‌రుగుతోంది.

అయితే ఇవ‌న్నీ మాట‌ల‌కే ప‌రిమితం కాకూడ‌దు. మార్ఫింగ్ కి పాల్ప‌డిన వాళ్ల‌కు శిక్ష త‌ప్ప‌దు అనేది నిరూపించ‌డానికైనా బాధ్యులపై వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టాలి. ఒక‌రికో ఇద్ద‌రికో శిక్ష ప‌డితే… కాస్త సీరియ‌స్‌నెస్ క‌నిస్తుంది. అయితే సైబ‌ర్ క్రైమ్ చ‌ట్టాలు అంత తేలిగ్గా అర్థ‌మ‌య్యేవి కావు. ఇందులోనూ చాలా లొసుగులు ఉన్నాయి. వాటికి అడ్డు పెట్టుకొనే ఇలాంటి వాళ్లు బ‌రితెగిస్తుంటారు. `మా` లాంటి సంస్థ‌లు కొన్ని క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంది. పైర‌సీ బాధ విప‌రీతంగా ఉన్న రోజుల్లో మాలో పైర‌సీ సెల్ స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేసింది. దానిపై అవ‌గాహ‌న క‌ల్పించి, పైర‌సీ దారుల్ని ప‌ట్టుకోవ‌డంలో ప్ర‌భుత్వానికి త‌న వంతు స‌హాయం చేసింది. ఇప్పుడు కూడా అలాంటి ఓ సెట‌ప్ ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం `మా`కు ఎంతైనా ఉంది. మా కోసం బిల్డింగ్ క‌ట్ట‌డం ఎంత ముఖ్య‌మో… `మా` స‌భ్యుల ప్ర‌తిష్ట‌ని నిల‌బెట్ట‌డం కూడా అంత‌కంటే ముఖ్యం. ఈ విష‌యంలో `మా` ఏం చేస్తుందో, ఏం చేయ‌బోతోందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీ ప్రెస్‌మీట్లు పెట్టకపోవడానికి మీడియానే కారణం !

మోదీ గత పదేళ్లకాలంలో ఒక్క సారే ప్రెస్ మీట్ పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిపోయిన తర్వాత అమిత్ షాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్ లో...

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను ఇప్పుడెవరు పట్టించుకుంటారు !?

పేదలకు వైద్యం ఆపేస్తామని ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఏపీలోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తమకు...

125 సీట్లు వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ !?

బీజేపీ 250 సీట్లు సాధించినా కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు సాధించినా ఒకటేనని.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఎలా సాధ్యమంటే.. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు మద్దతిస్తాయి...

సెఫాలజిస్టులందరి మాట టీడీపీ కూటమే !

దేశంలో అగ్రశ్రేణి సెఫాలజిస్టులు అందరూ ఏపీలో టీడీపీ కూటమే గెలుస్తుందని విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎప్పటి నుంచో తన వాదన వినిపిస్తున్నారు. ఏపీలో విస్తృతంగా పర్యటించి ఇంటర్యూలు చేసి వెళ్లిన ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close