నమ్మండహే – సీఐడీ లుకౌట్ నోటీసులు పొరపాటున ఇస్తుంది !

లుకౌట్ నోటీసులు సీఐడీ పొరపాటున ఇస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా సీఐడీ లాయర్ హైకోర్టుకు చెప్పారు. ఇలా నోటీసులు ఇచ్చి పొరపాటున ఇచ్చామని కవర్ చేసుకునే దర్యాప్తు సంస్థలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా.. అలాంటి సంస్థలపై కోర్టులు ఎలా స్పందిస్తాయన్నది తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడు చెప్పిన కారణం మాత్రం.. అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. హైకోర్టులో సీఐడీ ఇలా చెప్పిందంటే.. రేపు తాము పెట్టిన కేసులన్నీ పొరపాటున పెట్టామని వాదించినా ఆశ్చర్యం లేకపోవచ్చు. అసలేం జరిగిందంటే.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్‌ వేశారు. విచారణలో తనను నిందితుడుగా పేర్కొంటూ.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారని అదే సమయంలో మళ్లీ మళ్లీ 161, 91 కింద నోటీసులు ఇచ్చారని కోర్టు దృష్టికి కిలారు రాజేష్ తరపు న్యాయవాది దృష్టికి తీసుకెళ్లారు.

అప్పుడు గతుక్కుమన్న సీఐడీ లాయర్ తాము ఎల్‌ఓసీ పొరపాటున ఇచ్చామని చెప్పుకొచ్చారు. తాము రాజేష్‌ను నిందితుడిగా పేర్కొనలేదని సీఐడీ న్యాయవాది చెప్పారు. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని సీఐడీ న్యాయవాదులు కోరారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టుల ఈనెల 17కు వాయిదా వేసింది.

సీఐడీ వ్యవహారశైలి చూస్తూంటే.. కోర్టులు ఎలా భరిస్తున్నాయో కానీ.. చట్టంతో చెలగాటం అడుతున్నారని ఎవరికైనా అర్థమైపోతుంది. ఆధారాల్లేని కేసులు పెట్టడం.. అడ్డగోలుగా అరెస్టులు చేయడం.. టార్గెట్ గా పెట్టుకున్న వారిని ఎలాగోలా కొన్నాళ్లు జైల్లో ఉంచడం అన్నట్లుగా సాగిపోతోంది. తెలంగాణ హైకోర్టులో కూడా ఇలా మార్గదర్శి ఎండీ మీద తప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేసి చీవాట్లు తిన్నది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close