స్క్రిప్టేనా – వారసుడికే కర్ణాటక బీజేపీ కిరీటం !

వారసత్వ రాజకీయాలపై విమర్శలు చేయడం మోదీ, షాల స్పెషాలిటీ. కానీ ఆ వారసత్వ రాజకీయాలకే వారు పెద్ద పీట వేస్తూంటారు. కర్ణాటకలో ఓడిపోయిన తర్వాత ఆ రాష్ట్రంలో బీజేపీ నాయకుడు.. అసెంబ్లీలో బీజేఎల్పీకి నాయకుడు లేకుండా పోయారు . చివరికి ఆరు నెలల కసరత్తు చేసి.. యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రకు బీజేపీ కర్ణాటక చీఫ్ పోస్టు ఇచ్చారు. ఆయన మరో కుమారుడు ఎంపీగా ఉన్నారు. తెలంగాణ బీజేపీ హైకమాండ్.. విజయేంద్రను ఎంపిక చేస్తుందని ఎవరూ అనుకోలేదు.

ఎదుకంటే అసలు యడ్యూరప్పనే కాదు.. ఆయన కుమారులిద్దర్ని రాజకీయాల నుంచి విరమించుకోవాలని గతంలో హైకమాండ్ సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ యడ్యూరప్ప లేకపోత.. బీజేపీ పరిస్థితి దారుణం అయిపోతుదని వెంటనే మనసు మార్చుకున్నారు. ఒకే సమాజికవర్గానికి చెందిన బొమ్మైను సీఎం సీటులో కూర్చోబెట్టినా ప్రయోజనం లేకపోయింది. చివరికి యడ్యూరప్ప కుమారుడికే పట్టం కట్టారు.

అందరూ విమర్సలు గుప్పిస్తారని తెలిసినా బీజేపీకి మరో దారి లేకుండా పోయింది. విజయేంద్రకే పట్టం కట్టారు. అయితే విజయేంద్రకు పార్టీ నడిపే అంత సామర్థ్యం ఉందాలేదా అన్నదానిపై చాలా విశ్లేషణలు ఉన్నాయి. కానీ యడ్యూరప్ప విజయేంద్ర వెనుక ఉంటారు కాబట్టి.. బండి నడిచిపోతుందని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లు సాధించడం కీలకమని..బీజేపీ భావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హార్డ్ డిస్క్ పోయిందా.. ఇదేం విచిత్రం!

సినిమా రిజల్ట్ ఎవ‌రి చేతుల్లోనూ ఉండ‌దు. ఎంత క‌ష్ట‌ప‌డినా ప్రేక్ష‌కుల తీర్పు ఫైన‌ల్‌. కంటెంట్ చేతిలో లేక‌పోయినా, ఫుటేజ్ అయినా చేతుల్లోనే ఉంటుంది క‌దా. దాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సిన బాధ్య‌త నిర్మాణ సంస్థ‌కు...

బూతుల‌కు మ్యూట్‌.. ఇప్పుడంతా క్లియ‌ర్‌!

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' ట్రైల‌ర్ చూసి అంతా షాక్ తిన్నారు. ఇంటిన్సిటీ మాట ప‌క్క‌న పెడితే, అందులో కొన్ని బూతులు య‌దేచ్ఛ‌గా వ‌దిలేశారు. ట్రైల‌ర్‌లోనే ఇన్ని ఉంటే, ఇక సినిమాలో ఉన్ని ఉంటాయో...

వారి ఓట్లు ప‌డ‌లే… వైసీపీకి సీన్ అర్థ‌మ‌య్యింది!

ఏపీలో రిజ‌ల్ట్ డే ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ టెన్ష‌న్ పెరిగిపోతుంది. కూట‌మికి వైసీపీకి మ‌ధ్య నువ్వా-నేనా అన్న‌ట్లు సాగిన పోరులో గెలుపెవ‌రిదో తేలిపోనుంది. అయితే, ఏ విష‌యంలోనూ అల‌స‌త్వం లేకుండా ఇరు వ‌ర్గాలు...

గులాబీకి గుచ్చుకుంటున్న ఆర్ఎస్పీ ముళ్ళు..!!

కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై బీఆర్ఎస్ నేతల విమర్శలు వ్యూహమో, మరేమిటో కాని నేతల మధ్య సమన్వయం కొరవడినట్లు కనిపిస్తోంది. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్... ఈ ఇద్దరు నేతలు ఒకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close