కూకట్‌పల్లిలో జనసేనకు దక్కని బీజేపీ సహకారం !

తెలంగాణలో జనసేన పోటీ చేస్తున్న నియోజవకర్గాల్లో ఒక్కటి మాత్రమే గ్రేటర్ పరిధిలో ఉంది. అది కూడా కూకట్ పల్లి కావడంతో ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెడతామని గట్టి నమ్మకంతో ఉంది. అయితే జనసేన అభ్యర్థి ముమ్మారడ్డి ప్రేమ్ కుమార్ కు పరిస్థితులు కలసి రావడం లేదు. జనసేన పార్టీకి నిర్మాణం లేదు. పవన్ ఫ్యాన్స్ స్వచ్చందంగా చేస్తున్నప్రచారమే కీలకంగా మారింది. బీజేపీ తరపు నుంచి సహకారం లభించడంలేదు.

నిజానికి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ బీేపీ నేత. చివరి క్షణంలో జనసేన పార్టీ లో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. కానీ ఆయనకు బీజేపీ క్యాడర్ నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందడం లేదు. బీజేపీ పోటీ చేయకపోవడంతో చాలా మంది సైలెంట్ అయిపోయారు. కొంత మంది ప్రయత్నం చేస్తున్నా వారి బలం సరిపోవడం లేదు. బీజేపీ రాష్ట్ర నేతలు కూడా కూకట్ పల్లి వైపు చూడటం లేదు. గెలిచే అవకాశం ఉన్న మిత్రపక్ష సీటులో ఓ సారి ప్రచారం చేద్దామన్న ఆలోచన చేయడం లేదు.

బీజేపీ అగ్రనేతల పర్యటనలు ఏవీ ఖరారు కాలేదు. అదే సమయంలో.. పవన్ కల్యాణ్ ప్రచారంపైనా ఇంకా స్పష్టత రాలేదు. ఇంకా ప్రచారానికి పది రోజుల మాత్రమే సమయం ఉంది. పవన్ కనీసం రెండు రోజుల పాటు రోడ్ షో నిర్వహిస్తే..సీన్ అంతా మారిపోతుందని అభ్యర్థి ఆశలు పెట్టుకుంటున్నారు. బీజేపీ అగ్రనేతలతో కలిసి.. పవన్ రోడ్ షో నిర్వహించాలని కోరుకుంటున్నారు. వారు చాన్స్ ఇస్తారో లేదో తెలియక తికమక పడుతున్నారు.

పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న మాధవరం కృష్ణారావు… కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ … చురుకుగా ప్రచారం చేసుకుంటున్నారు. వారికి కాంగ్రెస్ అగ్రనేతలు సహకరిస్తున్నారు. జనసేన పార్టీ అభ్యర్థి మాత్రమే ఒంటరిపోరాటం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close