ఇంటలిజెన్స్ చీఫ్‌తో మార్పు ప్రారంభించిన సీఎం రేవంత్ !

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. సోనియా సహా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలందరూ హాజరైన కార్యక్రమంలో అట్టహాసంగా ప్రమాణం చేశారు. రేవంత్ కాకండా మరో పదకొండు మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఆరు గ్యారంటీల అమలు కోసం సంతకం చేశారు.

ఆ తర్వాత సెక్రటేరియట్ కు వెళ్లారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ కు బయలుదేరారని తెలుసుకుని మూడు కిలోమీటర్ల ముందే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కానీ ఇప్పుడు సీఎం కాన్వాయ్ తోనే లోపలకు వెళ్లారు. ఇలా సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టగానే అలా మార్పులు ప్రారంభించారు. డీజీపీ కన్నా ముందు ఇంటలిజెన్స్ చఫ్ ను మార్చేశారు. బి.శివధర్ రెడ్డి అనే ఐపీఎస్ ఆఫీసర్ ను ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించారు. ఇంటలిజెన్స్ తోనే.. రేవంత్ తో పాటు కాంగ్రెస్ నేతలందర్నీ బీఆర్ఎస్ నేతలు ఓ ఆట ఆడుకున్నారు. ఏ అధికారి ఏం చేశారో ఆయనకు స్పష్టత ఉంది. అందుకే ముందుగా ఇంటలిజెన్స్ చీఫ్ ను నియమించుకున్నారు. తర్వాత సీఎం వ్యవహారాలు చూసేందుకు శేషాద్రి అనే అధికారిని నియమించారు.

నిజానికి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి తెలంగాణ మొదటి ఇంటలిజెన్స్ చీఫ్. కేసీఆర్ తొలి సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయననే ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించారు. కానీ రెండేళ్లలో మార్చేశారు. అసలేమయిందో తెలియదు కానీ అప్పట్నుంచి ఆయన లూప్ లైన్ లో ఉన్నారు. ఇప్పుడు ఏడీజీగా రైల్వేస్ , రోడ్ సేఫ్టీలో ఉన్నారు. ఆయన ను రేవంత్ రెడ్డి ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించడం ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వంద కోట్ల వెబ్ సిరీస్ ఏమైంది రాజ‌మౌళీ?!

బాహుబ‌లి ఇప్పుడు యానిమేష‌న్ రూపంలో వ‌చ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో ఈనెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే 'బాహుబ‌లి' సినిమాకీ ఈ క‌థ‌కూ ఎలాంటి సంబంధం ఉండ‌దు. ఆ పాత్ర‌ల‌తో,...

గుంటూరు లోక్‌సభ రివ్యూ : వన్ అండ్ ఓన్లీ పెమ్మసాని !

గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో ఏకపక్ష పోరు నడుస్తున్నట్లుగా మొదటి నుంచి ఓ అభిప్రాయం బలంగా ఉంది. దీనికి కారణం వైసీపీ తరపున అభ్యర్థులు పోటీ చేయడానికి వెనకడుగు వేయడం....

కాళ్లు పట్టేసుకుంటున్న వైసీపీ నేతలు -ఎంత ఖర్మ !

కుప్పంలో ఓటేయడానికి వెళ్తున్న ఉద్యోగుల కాళ్లు పట్టేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వారి తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుప్పంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు...

‘పూరీ’ తమ్ముడికి ఓటమి భయం?

విశాఖపట్నం జిల్లాలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి నర్సీపట్నం 'హార్ట్' లాంటిది, ఇక్కడ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close