కోవిడ్ రిటర్న్స్ – మళ్లీ మాస్కుల హడావుడి !

కరోనా కొత్త వేరియంట్ పేరుతో హడావుడి ప్రారంభమైంది. కేరళలో జేఎన్.1 వేరియంట్ నమోదయిందని తెలియగానే దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని అలర్ట్ గా ఉండాలని కేంద్రం హడావుడి ప్రారంభించింది. కొత్తగా రాష్ట్రాలు అడ్వయిజరీలు జారీ చేస్తున్నాయి. మాస్కులు మళ్లీ బయటకు తీయాలని సూచిస్తున్నాయి. శానిటైజర్లు.. ఆంక్షలు కామన్ అవబోతున్నారు. దీనంతటికి కారణం కొత్త వైరస్‌ విస్తరణపై భయమే. నిజానికి కరోనా ను ప్రజలు మర్చిపోతున్నారు. ఓ పీడకలగా భావిస్తున్నారు.

కరోనా లక్షణాలు పూర్తిగా జలుబు, దగ్గులే కావడం.. కరోనా ప్రత్యేక చికిత్స లేకపోవడంతో టెస్టులు కూడా చేయించుకోకుండా.. మామూలు మెడికేషన్ కొనసాగిస్తున్నారు. ఎవరికి వస్తుందో.. ఎవరికి తగ్గిపోతుందో తెలియడం లేదు. కానీ.. ఇప్పుడు కొత్త వేరియంట్ ప్రభావం పెరుగుతూండటంతో.. మళ్లీ గందరగోళం ప్రారంభమవుతోంది. నిపుణుల పేరుతో కొత్త వేరియంట్ ఎంత భయంకరమైనదో చెప్పి భయపెట్టేందుకు కొంత మంది నిపుణులు రంగంలోకి దిగిపోయారు.

నిజానికి కరోనా వేరియంట్స్…. భయం పై ఎన్ని సార్లు ఇలాంటి అప్రమత్తతలు చెప్పారో లెక్కే లేదు. కానీ అప్రమత్తత పేరుతో భయాన్ని ప్రజల్లో నింపుతూండటంతో ఎక్కువ అనర్థాలు జరుగుతున్నాయి. కరోనా పేరుతో ప్రజల్లోకి పంపే పానిక్.. అన్ని రకాల సమస్యలకు కారణం అవుతోంది. అన్ని వ్యాక్సిన్లు పని చేస్తాయని చెబుతున్నారు. దాదాపుగా అందరూ వ్యాక్సిన్లు వేసుకున్నారు . ఇలాంటి సమయంలో కొత్త కరోనా వేరియంట్ పేరుతో బయపెట్టడం కన్నా వ్యూహాత్మక చర్యలు తీసుకోవడంపైనే ప్రభుత్వ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి దొరికిన పీవోకే అస్త్రం !

బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటోందని ప్రచారం జరుగుతున్న సమయంలో రిజర్వేషన్ల రద్దు పై ప్రజల్లో జరిగిన చర్చ ఆ పార్టీని సమస్యల్లోకి నెట్టింది. చచ్చినా రిజర్వేషన్లు రద్దు చేయబోమని ప్రజల్ని బతిమాలుకోవాల్సి వచ్చింది....

రేవంత్ రాజీనామా…? త్వరలో కొత్త బాస్?

లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త పీసీసీ అద్యక్షుడి నియామకం ఉంటుందని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించడంతో పార్టీ ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. జూన్ నెలాఖరులో లోకల్ బాడీ...

ఈసీపై నిందలేయడానికే ప్లాన్డ్ హింస !

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతర హింస దేశం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కువగా హింస జరుగుతుంది. అది రెండు, మూడు రోజుల్లో సద్దుమణిగిపోతుంది. కానీ ...

క్యాడర్ హోప్స్ పెట్టుకోవద్దని హింట్స్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ క్యాడర్ ను ఆర్తికంగా చితికిపోకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. బెట్టింగులు కట్టి నష్టపోకుండా ఉండేందుకు ఆయన మెల్లగా హింట్స్ ఇస్తున్నారు. దాదాపుగా ప్రతి రోజూ ప్రెస్ మీట్లు పెట్టి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close