ఈనాడు, జ్యోతి, టీవీ 5, టీడీపీ ఆరు గ్యారంటీలకు జగన్ రెడ్డి పబ్లిసిటీ !

జగన్ రెడ్డి బహిరంగసభలో ఈనాడు పేపర్ ను చూపించి అందులో ఏమున్నదో చదివి వినిపించారు. వెటకారం చేద్దామనో…. అందులో తప్పు రాశారని చెప్పడం ఆయన ఉద్దేశం కావొచ్చు కానీ.. ఆయన మాటలు విని.. ఈనాడును చూడని వైసీపీ వాళ్లకు స్వయంగా ఆయనే ఈనాడులో ఏమొస్తుందో చెప్పే ప్రయత్నం చేశారు. ఈనాడుకు ఇంత కన్నా కావాల్సింది ఏముంది ?. జగన్ రెడ్డి అలా స్టేజ్ మీద ఈనాడును చూపించడం వల్ల సాక్షి మాత్రమే చదవుతూ.. అదో లోకంలో ఉండిపోతున్నామని అనుకునే జగన్ రెడ్డి ఫ్యాన్స్ ఇక నుంచి ఈనాడు, జ్యోతిలు కూడా చదివే అవకాశం ఉంది. నెగెటివ్ పబ్లిసిటీ కూడా చాలా సార్లు ప్లస్ అవుతుంది.

ఈనాడు గురించి ఈ రోజు జగన్ రెడ్డి ప్రజలకు చెప్పాల్సిన పని లేదు. ఆయన నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఈనాడుపై ఎవరి అభిప్రాయం వారికి ఉంది. ఈనాడు చదవొద్దని.. జగన్ రెడ్డి ఎన్నో సార్లు పిలుపునిచ్చారు. కానీ ఆయనే చదువుతూ.. ఇందులో ఇలా వచ్చిందని.. ప్రజలకు చూపిస్తున్నారు. అంతేనా… మీకు తెలియని విషయాలు తెలియాలంటే.. ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతి, టీవీ 5 కూడా చూడాలన్నట్లుగా పిలుపునిస్తూ ఉంటారు.

కొత్తగా ఆయన ఆరు గ్యారంటీలకూ ప్రచారం చేస్తున్నారు. చింతపల్లి సభలో ఆరు గ్యారంటీల గురించి పక్కన వాళ్లను అడిగి మరీ తెలుసుని ప్రచారం చేశారు. తాము ఇస్తున్న దాని కన్నా మూడింతలు సంక్షేమం ఇస్తామంటున్నారని చెప్పుకొచ్చారు. ఇవ్వలేరని మోసం చేస్తారని చెప్పడం ఆయన ఉద్దేశం కావొచ్చుకానీ.. ఏమీ చేయకుండా అప్పులు తెచ్చి బటన్ నొక్కేవాడే ఇస్తే… ఇక సంపద సృష్టించి ఇచ్చేవాళ్లు ఎందుకు ఇవ్వరని.. సందేహం ఎదురుగా కూర్చున్న వాళ్లకు వస్తుంది.

మొత్తంగా జగన్ రెడ్డి కూడా.. తమకు ప్రచారం.. నెగెటివ్ వేలో అయినా సరే తమ పథకాలను వైసీపీ క్యాడర్..సానుభూతి పరుల్లోకి తీసుకెళ్లడం వారికి హ్యాపీగా అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close