జేడీ లక్ష్మినారాయణ కొత్త పార్జీ జై భారత్

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఏ పార్టీలోనూ టిక్కెట్ దక్కే అవకాశం లేకపోవడంతో సొంత పార్టీ పెట్టేసుకున్నారు. విశాఖ నుంచి పోటీ చేయాలనుకున్న ఆయన ఏ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెడెంట్ గా పోటీ చేస్తానని కొంత కాలంగా చెబుతూ వస్తున్నారు. కానీ ఎన్నికలకు రెండు నెలల ముందు మనసు మార్చుకున్నారు. సొంత పార్టీ ప్రకటించారు. జై భారత్ అని పేరు ప్రకటించారు. 2019 సార్వత్రిక ఎన్ని కల్లో జనసేన పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా లక్ష్మీనారాయణ పోటీచేశారు.

ఓడిపోయిన తర్వాత అక్కడే కొంత కాలం పని చేసుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నారన్న కారణమంగా జనసేనకు రాజీనామా చేశారు. ఆ తర్వాత రైతు, ప్రజా సమస్యలు, యువత ఓటింగ్ పై అవగాహన కల్పిస్తూ పర్యటించారు. ఇటీవల ఆయన అన్ని పార్టీను పొగుడుతున్నారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. చివరికి సొంత పార్టీ పెట్టాలని డిసైడయ్యారు. నిజానికి జేడీ లక్ష్మినారాయణ వీఆర్ఎస్ తీసుకున్నప్పుడు ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది.

అప్పట్లో సొంత పార్టీ పెడితే ఎంతో కొంత వర్కవుట్ అయ్యేదన్న అభిప్రాయం వినిపించింది. కానీ ఈ మధ్య కాలంలో జేడీ వైసీపీని కూడా పొగడటంతో.. ఆయన ఇమేజ్ పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు కొత్త పార్టీ ప్రకటించారు. ఆయన ఈ పార్టీతో రాష్ట్రమంతా అభ్యర్థుల్ని నిలుపుతారా.. లేకపోతే తానొక్కడే.. విశాఖ నుంచి పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. జేడీ విశాఖలో కాకుండా.. విజయవాడలో పార్టీని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close