అంగన్వాడి పేరుతో సాక్షికి కోట్లలో ప్రకటనలు !

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో స్వల్ప వేతనాలతో బతుకులీడుస్తున్న వారు రోడ్డెక్కితే వారిపై విషం చిమ్ముతోంది వైసీపీ. ప్రభుత్వం వచ్చాక వారికి ఏదో దోచి పెట్టామని ప్రచారం చేస్తోంది. వారికి కొద్దిగా సాయం చేయడానికి చేతులురావట్లేదు కానీ వేల కోట్లు పెట్టి వారిపై తప్పుడు ప్రచారం చేయడానికి ప్రకటనలు ఇస్తున్నారు
గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ పేరిట వాణిజ్య ప్రకటనలు జారీ చేశారు. ఇందులో అన్నీ అబద్దాలే.

జగన్ రెడ్డి అధఇకారంలోకి వచ్చిన 13 జూలై 2019 న జీవో విడుదల చేసింది. అందులో కేవలం వెయ్యి రూపాయల చొప్పున పెంచుతున్నట్లుగా స్పష్టంగా ఉంది. కానీ సాక్షికి ఇచ్చిన ప్రకటనలో వర్కర్‌ వేతనం రూ.7,000 నుండి అమాంతం రూ.11,500కు తమ సర్కారే పెంచినట్టు చెప్పారు. అంగన్‌వాడీ వర్కర్‌ నెలకు రూ.11,500 చొప్పున ఎడాదికి రూ.1,38,000 సంపాదిస్తున్నారని తెల్ల కార్డు రద్దు చేసి సంక్షేమ పథకాలూ 2020లోనే నిర్దాక్షిణ్యంగా నిలిపివేశారు. నిజం కళ్ల ముందే ఉంటే.. తప్పుడు ప్రచారాల ద్వారా అందర్నీ నమ్మించాలనుకుంటున్నారు.

ఇప్పుడు రోడ్లపై ఉన్నది అంగన్వాడిలే కాదు..దాదాపు ప్రతి వర్గం ఉంది. వారితో చర్చలు జరిపి వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సింది పోయి… ఈ పేరుతోనూ పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు జారీ చేయడం అవినీతి కి పరాకాష్టగా మారింది. ప్రజాధనాన్ని సొంతంగా వాడుకోవడానికి ఏ అవకాశాన్నీ వదలడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close