కాళేశ్వరం కేసు కోసం బీజేపీ రాజకీయం – ఎవర్ని కాపాడటానికి ?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఇప్పుడు గేమ్ చేంజర్‌గా మారుతోంది. జ్యూడీషియల్ విచారణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లోపు భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా తెర ముందుకు వచ్చింది. సీబీఐ విచారణకు సిఫార్సు చేయాలని డిమాండ్ చేస్తోంది. గతంలో సీబీఐ విచారణ అడిగారు కదా ఇప్పుడు ఎందుకు కాళేశ్వరం అవినీతిని సీబీఐకి ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు.

కాళేశ్వరంలో కాస్తంత విచారణ జరిపితే అవినీతి వేల కోట్లలో బయటకు వస్తుందని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతోంది. బీజేపీ కూడా మొదటి నుంచి కాళేశ్వరం అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంది. గతంలో కాంగ్రెస్ నేత రేవంత్ నేరుగా సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి విచారణ జరగలేదు. సీబీఐ విచారణ జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాల్సి ఉందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో డిమాండ్ చేసినట్లుగా సీబీఐకి సిఫారసు చేయాలని.. రెండు రోజుల్లో విచారణ ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి సవాల్ చేస్తున్నారు.

కాళేశ్వరంలో కేంద్రం పాత్ర లేదు. రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు. కానీ కాళేశ్వరంకు కేంద్రం సహకరించింది. పలు రకాల రూల్స్ ఉల్లంఘించి అనుమతులు, అప్పులు ఇప్పించారు. ఇవన్నీ విచారణలో బయటకు వస్తాయన్న కారణంగానే బీజేపీ సీబీఐ విచారణకు పట్టుబడుతోందని అనుమానిస్తున్నారు.
కాళేశ్వరం బడా కాంట్రాక్టర్ బీజేపీకి కొన్ని వందల కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. కాళేశ్వరంలో ఎక్కడెక్కడ ఎంతెంత అవినీతి జరిగిందో తమకు పూర్తి సమాచారం ఉందని.. జ్యూడిషియల్ విచారణతో మొత్తం ప్రజల ముందు పెడతామని అంటున్నారు.

మొత్తంగా రెండు పార్టీలు కాళేశ్వరంపై విచారణకు పోటీ పడుతున్నాయి. విచారణ ఎవరు చేస్తారు.. ఎవరు నిజాల్ని బయటపెడతారన్నది సస్పెన్స్ గా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసేన స్ట్రైక్ రేట్ ఎనభై శాతం ఉంటుందా?

జనసేన పార్టీ గత ఎన్నికల్లో చదవి చూసిన ఘోర పరాజయాన్ని మరిపించేలా ఈ సారి ఎన్నికల పలితాలు ఉంటాయని పోలింగ్ సరళి తర్వాత నిపుణులు ఓ అంచనాకు వస్తున్నారు. మొత్తం ఇరవై...

భారత్ కు అమెరికా వార్నింగ్ ..!!

ఇరాన్ తో చాబహార్ పోర్టుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడంపై ఇండియాకు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ తో ఏ సంస్థ అయినా, దేశమైనా వ్యాపార లావాదేవీలు జరిపితే ఆంక్షలు విధిస్తామని...

తెరపైకి క్రికెటర్ క్యారెక్టరైజేషన్

ఫాస్ట్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ గుర్తున్నాడా? మెరుపు వేగంతో బంతులు వేసే బాలాజీ ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు. ఆయన సీరియస్ గా కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. దాదాపుగా ఆయన స్మైల్ ఫేస్...

పట్టభద్రుల బైపోల్..ప్రధాన పార్టీలకు స్వతంత్ర అభ్యర్థుల బెడద..?

లోక్ సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికపైనే నెలకొంది. ఈ నెల 27న ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల స్థానానికి బైపోల్ జరగనున్న నేపథ్యంలో ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close