వైసీపీ లైన్‌లోనే కేశినేని !

కేశినేని నాని, ఆయన కుమార్తె పూర్తిగా వైసీపీ లైన్‌లోనే వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. రోజూ ఏదో ఓ ప్రకటన చేసి.. వైసీపీ మీడియాకు ఫీడ్ అందించే ప్లాన్ ప్రకారమే .. వ్యవహారాలు నడుపుతున్నారు. కేశినేని శ్వేత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయడానికి పెద్ద షో చేశారు. తీరా వెళ్లి మేయర్ కు రాజీనామా లేఖ ఇచ్చారు. అందు కోసం పక్కా ఏర్పాట్లు చేసుకున్నారు. మేయర్ తో పాటు వైసీపీ కార్యకర్తలు, మీడియా సమయానికి తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు. శ్వేత కూడా ముందుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటికి వెళ్లి రాజకీయం ప్లే చేశారు. తనకు గద్దె రామ్మోహన్ బీఫాం ఇచ్చారని అందుకే ఆయనను కలవడానికి వెళ్లానని చెప్పుకొచ్చారు.

మరి కేశినేని నాని.. తనకు బీఫాం ఇచ్చిన చంద్రబాబును కలిసి చెబుతారా అన్న ప్రశ్న సాధారణం వస్తుంది. పైగా.. కేశినేని శ్వేత రాజీనామా చేసే సమయంలో పక్కన వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవ సత్యం.. ఆమె వెన్నంటే ఉన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసినప్పుడు కేశినేని నాని కానీ.. శ్వేత కానీ కనీసం స్పందించలేదు. రాజీనామా తర్వాత ఆమె.. తమకు ఏడాదిన్నర నుంచి అవమానాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.

కానీ మూడేళ్ల పాటు వారు చేసిన పనులను చూసిన తర్వాతనే ఇక మారరని పార్టీ పక్కన పెట్టిందని మాత్రం గుర్తించలేకపోయారు. తిరువూరు సభకు ఇంచార్జ్ గా చిన్నిని నియమించినా సన్నాహాక సమావేశానికి వెళ్లి రచ్చ చేశారు. కావాలనే ఈ రాజకీయాలు మొత్తం వైసీపీ వ్యూహం ప్రకారం చేస్తున్నారని అంటున్నారు. సమయం చూసుకుని వారు వైసీపీలో చేరిపోతారని.. విజయవాడ పార్లమెంట్ కు వైసీపీ తరపున కేశినేని నానినే అభ్యర్థిగా ఉంటారని ఇప్పటికే వైసీపీలోనూ చర్చ జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

ఐపీఎల్ బిగ్ ఫైట్- కేకేఆర్ ను ఎస్.ఆర్.హెచ్ మ‌డ‌త‌పెట్టేస్తుందా?

ఐపీఎల్ లో కీలక సమరానికి రంగం సిద్దమైంది. లీగ్ మ్యాచ్ లు పూర్తి కావడంతో మంగళవారం తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ - కోల్ కత్తా నైట్ రైడర్స్...

‘భ‌జే వాయు వేగం’… భ‌లే సేఫ్ అయ్యిందే!

కార్తికేయ న‌టించిన సినిమా 'భ‌జే వాయు వేగం'. ఈనెల 31న విడుద‌ల అవుతోంది. ఈమ‌ధ్య చిన్న‌, ఓ మోస్త‌రు సినిమాల‌కు ఓటీటీ రేట్లు రావ‌డం లేదు. దాంతో నిర్మాత‌లు బెంగ పెట్టుకొన్నారు. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close