చైతన్య : పారిపోవద్దు కేటీఆర్ – నిరూపించుకో !

భారత రాష్ట్ర సమితి పరాజయం తర్వాత కేటీఆర్ బాధ్యతల నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కేసీఆరే మళ్లీ ప్రతిపక్ష నేతగా పోరాడతారని…ఆయన వస్తే కాంగ్రెస్ పని ఖతం అని చెబుతున్నారు. కానీ తానే ముందుండి పార్టీ నడిపిస్తానని … కాంగ్రెస్ సంగతి చూస్తానని చెప్పడం లేదు. పైగా ఎంపీగా పోటీ చేస్తానని లీకులిస్తున్నారు. అంటే రాష్ట్ర రాజకీయాలకు దూరంగా వెళ్లాలనుకుంటున్నారు. మళ్లీ బరువుంతా కేసీఆర్ పైనే పెట్టాలనుకుంటున్నారు.

కేసీఆర్ బాధ్యత పూర్తయిపోయింది.. ఇక కేటీఆర్ దే !

తెలంగాణ సాధన లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్ అనుకున్నది సాధించారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అత్యున్నత స్థానానికి ఎదిగారు. పదేళ్లు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చారు. ఇప్పుడు బ్యాటన్ అందుకోవాల్సింది కేటీఆర్. పార్టీని మంచినా తేల్చినా ఆయనదే భారం. కొత్త తరం రాజకీయ వ్యహాలతో ముందుకు వెళ్లి యూపీలో అఖిలేష్ తరహాలో పార్టీని నిలబెడతారని ఎక్కువ మంది అనుకుంటున్నారు. అయితే కేటీఆర్ అనూహ్యంగా ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఇది సహజగానే బీఆర్ఎస్ క్యాడర్ లో ఆశ్చర్యానికి కారణం అవుతోంది.

రాజకీయ నేతగా అసలైన పరీక్ష ఇంకా ఎదుర్కోని కేటీఆర్

కేటీఆర్ రాజకీయనాయకుడిగా ఇంకా పూర్తి స్తాయిలో సామర్థ్యాన్ని నిరూపించుకోలేదు. అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ప్రజల తరపున పోరాడి అధికారంలోకి తెచ్చే స్థాయి రాజకీయం ఇంత వరకూ చేయలేదు. సవాళ్లను ఎదుర్కోలేదు. రాజకీయంగా వాటిని ఎలా అధిగమించాలన్న విషయంలో కేటీఆర్ రాజకీయంపై ఇంకా స్పష్టత లేదు. పూలపాన్పు మీద అన్నట్లుగా ఆయన రాజకీయాల్లోకి రాగానే ఉద్యమ బలం అంతా పార్టీకి వచ్చింది. అప్పట్నుంచి అధికారం అనుభవించారు. కానీ ఇప్పుడు ముళ్లబాట ప్రారంభమయింది. ఇది నడిస్తేనే రాజకీయ భవిష్యత్

బీఆర్ఎస్ ఓటమి ఓ రకంగా కేటీఆర్‌కు అవకాశం

కేటీఆర్ కు ఇప్పుడే అవకాశం వచ్చింది. తాను కూడా రాజకీయ నాయకుడ్నని.. నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ దిశగా కేటీఆర్ ప్రయత్నాలు సాగుతున్నాయా లేదా అన్నదానిపై బీఆర్ఎస్ లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ములాయం సింగ్ యాదవ్ వయసు అయిపోయి స్లో అవుతున్న సమయంలో అఖిలేష్ యాదవ్ మెల్లగా పార్టీపై పట్టు పెంచుకున్నారు. ఆయన నేరుగా పదవిలోకి రాలేదు. పార్టీని గెలిపించారు. ఇందుకోసం యూపీ అంతా విస్తృతంగా పర్యటించారు. ములాయంనే చూపించి ఎన్నికల ప్రచారం చేశారు. గెలిచిన తర్వాత అందరూ ఆయననే సీఎంగా ఎన్నుకున్నారు. ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. అఖిలేష్ చేసిన పోరాటం వల్లే రెండు సార్లు ఓడిపోయినా ఇంకా ప్రధానంగా పోరాడుతోంది ఎస్పీ. అలాంటి పునాదుల్ని.. నాయకత్వాన్ని ఇప్పుడు కేటీఆర్ నుంచి బీఆర్ఎస్ క్యాడర్ ఆశిస్తోందని అనుకోవచ్చు.

అలా చేయకుండా మళ్లీ టైగర్ కేసీఆరే అని పక్కకు తప్పుకుంటే అందివచ్చిన అవకాశాన్ని కాలదన్నుకున్నట్లే అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close