రోజాకు టిక్కెట్ ఎగ్గొట్టే స్క్రీన్ ప్లే స్టార్ట్ !

వచ్చే ఎన్నికల్లో రోజాకు టిక్కెట్ ఉందో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఆమెకు టిక్కెట్ ఎగ్గొట్టేందుకు స్క్రీన్ ప్లే మాత్రం ప్రారంభమయిందని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నగరి నియోజవర్గంలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు సాక్ష్యం. పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన ఓ మహిళా దళిత కౌన్సిలర్ తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టారు. రోజా మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని డబ్బులు తీసుకున్నారని కానీ ప దవి ఇవ్వలేదని ఆరోపించారు. తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వడం లేదన్నారు. వీటికి సంబంధించిన కొన్ని వీడియోలను దళిత మహిళా కౌన్సిలర్ స్పందించారు.

మరో వైపు చిత్తూరు జడ్పీ సమావేశంలో నగరికి చెందిన జడ్పీటీసీలు రోజాపై ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్యే, మంత్రిరోజా.. పనులకు సంబంధించిన ప్రొసీడింగ్స్ చేయనివ్వడం లేదని.. వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆమెకు మళ్లీ టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని చాలెంజ్ చేశారు. నిజానికి రోజాకు.. నియోజకవర్గంలో ఏ ఒక్క నేతతోనూ సంబంధాలు ఉండవు. అందరితోనూ గొడవలే. పైగా పార్టీ పదవుల కోసం డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

నియోజకవర్గంలో ఆమెపై తీవ్ర అసంతృప్తి ఉందని.. ఆమెకు ఎదురుగాలి వీస్తోందని అనేక సర్వేలు వెల్లడించాయి. దీంతో ఆమెకు టిక్కెట్ ఇవ్వకూడదని అనుకుంటున్నారు. కానీ రోజా చేసే రచ్చ పార్టీకి డ్యామేజ్ అవుతుందని వెనుకడుగు వేస్తున్నారు. కానీ ఇప్పుడు మార్చాలనుకోవడంతో.. మెల్లగా రోజాకు వ్యతిరేకంగా ఉన్న వారిని తెరపైకి తెస్తున్నారని అంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కూడా రోజా మళ్లీ పోటీ చేయడానికి వ్యతిరేకంగా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close