పులివెందుల క్యాడర్‌కు జగన్ డబ్బుల పంపిణీ – మరి ఇతర నియోజకవర్గాల్లో ?

పులివెందుల వైసీపీ నేతలకు జగన్ రెడ్డి డబ్బులు పంచుతున్నారు. స్థాయిని బట్టి రూ. యాభై వేల నుంచి ఇరవై లక్షల వరకూ పంచుతున్నారు. స్వయంగా అవినాష్ రెడ్డి లెక్కలు రాసుకుంటూ .. పులివెందులలోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచే ఈ డబ్బులు పంచుతూండటం ఆసక్తికరంగా మారింది. ఎన్ని కోట్లను పంచుతారనే సంగతిని పక్కన పెడితే ఎప్పుడూ లేని విధంగా సొంత పార్టీ క్యాడర్ కు డబ్బులు పంచడం ఏమిటన్న చర్చ మాత్రం పులివెందులలో నడుస్తోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్టీ క్యాడర్ పరిస్థితి ఘోరంగా మారింది. దానికి పులివెందుల కూడా మినహాయింపు కాదు. ఆర్థికంగా చితికిపోయారు. అందుకే ఎన్నికలకు ముందు అందరికీ ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. కార్యకర్తల దగ్గర ఓ లేఖ తీసుకుని యాభై వేలు ఇస్తున్నారు.. ఎంపీటీసీల స్థాయి నుంచి అన్ని స్థాయిలో ప్రజాప్రతినిధులకు లక్షలు పంచుతున్నారు. అయితే జగన్ రెడ్డి పరిస్థితి ఇలా ఉంటే.. మరి మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏమిటన్నది చాలా మందికి అర్థం కావడంలేదు.

రాష్ట్రం మొత్తం వైసీపీ క్యాడర్ పూర్తిగా దెబ్బతినిపోయింది. అందుకే ఎవరూ కనీసం గ్రామాల్లో వైఎస్ విగ్రహాల చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కల్ని కూడా తొలగించడం లేదు. వర్థంతులు… జయంతులు కూడా పట్టించుకోవడం లేదు. పార్టీ కోసం రూపాయి ఖర్చు పెట్టినా దండగేనని అనుకుంటున్నారు. ఈ పరిస్థితిని గమనించి క్యాడర్ కు డబ్బులు పులివెందులలో పంచుతున్నారు.. మరి నియోజకవర్గాల్లో క్యాడర్ కు ఎప్పుడు .. ఎవరు డబ్బులు పంచుతారు ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

‘విద్య వాసుల అహం’ రివ్యూ: మ‌ళ్లీ పాత పెళ్లి కథే!

తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' ప్రతి వారం ఎదో ఒక కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుకుంటుంది. ఈ వారం రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ నటించిన 'విద్య వాసుల అహం' ప్రేక్షకులు...

కడప కోర్టు తీర్పు రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్న సుప్రీంకోర్టు

వివేకా హత్యపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మండిపడింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని స్పష్టం...

కౌంటింగ్‌లో సహకరించాలన్నట్లుగా ఈసీని బెదిరిస్తున్న సజ్జల !

అయిందేదో అయిపోయింది.. ఇక తప్పు దిద్దుకో అని ఈసీని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీ ఏం తప్పు చేసిందో.. ఎలా దిద్దుకోవాలనుకుంటున్నారో ఆయన పరోక్షంగానే తన మాటలతో సందేశం పంపారు. అదేమిటంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close