రివర్స్ జాబితాలతో వైసీపీ కకావికలం -ఇది కూడా వ్యూహమేనా ?

ఇప్పటికి ఆరు జాబితాలో విడుదలయ్యాయి. ఒక జాబితాలో పేరున్న వారికి మరో జాబితాలో షాకిస్తున్నారు. ఎంపీ అభ్యర్థుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా మారుస్తున్నారు. మళ్లీ తర్వాత జాబితాలో వారికి మార్పులు తప్పడం లేదు. టిక్కెట్లు ప్రకటించిన వారు కూడా దండం పెడుతున్నారు. ప్రకటించని వారు కూడా అదే పని చేస్తున్నారు. కొంత మంది ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకుని మీకో దండం అంటున్నారు. జాబితాలో ఇంత గందరగోళం ఎందుకు చేసుకుంటున్నారంటే.. ఇదో వ్యూహం అని వైసీపీ పార్టీ నేతలు సర్ది చెప్పుకుంటున్నారు.

6 జాబితాల్లో ఎవరికైనా గ్యారంటీ ఉందా ?

ఆరు జాబితాలు కలిపితే బదిలీలు పోను దాదాపుగా 30 మంది వరకూ అభ్యర్థులకు టిక్కెట్లు నిరాకరించారు. వీరిలో చాలా మంది టిక్కెట్ అవసరం లేదనుకున్నవారు. మిగిలిన వారు.. తమను కాదని వేరే వారికి టిక్కెట్ ఇచ్చే ధైర్యం ఉందా అని సైలెంట్ గా ఉంటున్నారు. ఎన్నికలు దగ్గరకు రాగానే తమనే బతిమిలాడి టిక్కెట్ ఇస్తారని వారనుకుంటున్నారు. ప్రస్తుతం సమన్వయకర్తలుగా నియమిస్తున్న వారిలో సగం మందికి టిక్కెట్ డౌటేనని వైసీపీ వర్గాలే బహిరంగంగా చెప్పుకుంటున్నాయి. అందుకే నియమితులైన వారిలోనూ అంత ఉత్సాహం కనిపించడం లేదు.

జాబితాల కసరత్తును కామెడీగా తీసుకున్న క్యాడర్

జగన్ రెడ్డి చేస్తున్న జాబితాల కసరత్తును క్యాడర్ కూడా కామెడీగా తీసుకుంది. పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయడం అంటే… సొంత ఈగోలతో అత్యంత బలహీన అభ్యర్థిని ఎంపిక చేసి.. బలమైన పార్టీ నేతల్ని కించ పర్చడం అన్నట్లుగా ఉందని సెటైర్లు వేసుకుంటున్నార. అందుకే ఎక్కువ మంది సైలెంట్ అయిపోతున్నారు. ఇప్పటి వరకూ మార్పు చేర్పులు చేసిన అభ్యర్థుల్లో పది మందికి అయినా గెలిచే సామర్థ్యం ఉందా అని చర్చించుకుంటున్నారు. రఘురామకృష్ణరాజుపై కృష్ణంరాజు సతీమణినో.. గోకరాజు గంగరాజు కుటుంబసభ్యులనో పెడదామనుకుంటే.. అందరూ దండం పెట్టేశారు. చివరికి కాకినాకు చలమలశెట్టి సునీల్ ను కూడా బతిమాలి పోటీ పెట్టారని అంటున్నారు. ఇంత దుర్భరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో వైసీపీ నేతలకు అర్థం కావడంలేదు.

సైలెంట్ గా కసరత్తు చేసుకుని ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ప్రకటించుకోవచ్చుగా !

అదేదో కొంపలు మునిగిపోయినట్లుగా.. రోజువారీ కసరత్తు జరిపి.. జాబితాలను ప్రకటిస్తారు. ఏ జాబితాలోనూ పది మందికి మించి పేర్లు ఉండటం లేదు. అంత అవసరం ఏముందని.. అంతర్గతంగా కసరత్తు చేసుకుని ప్రకటన చేసుకోవచ్చు కదా అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. బదిలీ చేసిన వారు నియోజకవర్గాల్లో కుదురుకోలేక.. మళ్లీ తమ సొంత చోటనే టిక్కెట్ కేటాయించాలని ఒత్తిళ్లు ప్రారంభిస్తున్నారు. ఇవన్నీ వైసీపీలో గందరగోళంగా మారింది.. వైసీపీని చిందరవందర చేసుకోవడం కూడా వ్యూహామేనని వైసీపీ నేతలు సర్ది చెప్పుకుటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close