అరాచక రాజ్యం : రాప్తాడు సభలో దాడిపై కేసే లేదు !

జర్నలిస్టుపై దాడి ఘటనపై అనంతపురం పోలీసులు ఇప్పటి వరకూ కేసులు నమోదు చేయలేదు. హత్యాయత్నం చేసినా పోలీసులు నిర్లిప్తంగా ఉన్నారు. జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసినా కనీసం స్పందించలేదు. చర్యలు తీసుకుంటామని మొక్కుబడి ప్రకటన చేశారు. కానీ.. మీడియానే అసలు ఎవరు దాడి చేశారో కూడా ఆధారాలతో సహా ప్రచురించింది. కానీ పోలీసులకు మాత్రం కనిపించలేదు.

ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి ప్రణాళిక ప్రకారం జరిగింది. ఉద్దేశపూర్వంగా కొట్టారు. తమ గురించి వ్యతిరేకంగా రాస్తే.. చంపేస్తామని హెచ్చరికల్లో భాగంగానే ఈ దాడులు జరిగాయి. జగన్ రెడ్డి చొక్కా మడత పెట్టాలని ఇచ్చిన పిలుపు వెనుక ఉన్నది ఇదే. జగన్ రెడ్డి సర్వీస్ బ్యాచ్ అధికారులు మాత్రం నేరస్తులకే కొమ్ము కాస్తున్నారు. బాధితులపైనే కేసులు పెడుతున్నారు. ఏ మాత్రం సిగ్గుపడకుండా ఖాకీ డ్రెస్‌కు అవమానాలు తెస్తున్నారు.

ఉరవకొండలోనూ జర్నలిస్టులపై దాడి జరిగింది. అక్కడా పోలీసులది అదే నిర్లిప్తత. తీవ్ర విమర్శలు వచ్చాక.. ఎవరో పదిహేను మందిని అరెస్టు చేశామని చెప్పుకొచ్చారు. పోలీసుల వ్యవహారశైలి తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఇలాంటి వారితో ఎన్నికలు నిర్వహించడం అంటే… ఇక అరాచక రాజ్యంలో నేరస్తులకు ప్రజల్ని వదిలేసినట్లేనని అనుకోవచ్చు. ఈ నేరంలో అసలు తప్పు పోలీసులదే. ఏం చేసినా చర్యలు ఉండవన్న నేరస్తుల ధైర్యం కారణంగానే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close