పవన్ తిట్టి జగన్‌ను ఇంప్రెస్ చేయండి – టిక్కెట్ పట్టండి !

వైసీపీలో ఇప్పుడు ఓ రకమైన రాజకీయం నడుస్తోంది. టీడీపీ జనసేన పొత్తుతో రాజకీయంపై స్పష్టత రావడంతో చాలా మంది సైలెంట్ అయిపోయారు. అయితే ఇంకా టిక్కెట్ పై ఆశలు పెట్టుకుని.. జ గన్ రెడ్డి గాల్లో వేలాడదీస్తున్న కొంత మంది నేతలు మాత్రం.. పవన్ కల్యాణ్ ను బూతులు తిట్టి టిక్కెట్ ఖరారు చేసుకోవాలన్న తాపత్రయ పడుతున్నారు.

ఇలా చంద్రబాబు , పవన్ జాబితా ప్రకటించగానే అలా రోజా మైక్ ముందుకు వచ్చారు. తన మార్క్ డబుల్ మీనింగ్‌లతో నీలి, కూలి మీడియాకు పంట పండించారు. తర్వాత గుడివాడ అమర్నాథ్ వచ్చారు. ఆయన వెకిలి మాటలతో జగన్ ను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నించారు. ఇప్పటికీ వీరిద్దరూ టిక్కెట్లు ఖరారు కాలేదు. గుడివాడ అమర్నాథ్ రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయిందని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని పరిశ్రమల ప్రారంభోత్సవాలను చేయడమే దీనికి కారణమని అంటున్నారు. ఆయన చివరి ప్రయత్నంగా నోరు చేసుకుంటున్నారు. ఆయనకు బయట మరో పార్టీలో చాన్స్ దొరికే అవకాశాలు లేవు.

ఇప్పటికే టిక్కెట్ కావాలంటే చంద్రబాబు, పవన్ ను బాగా తిట్టాలనే ఓ సందేశాన్ని పార్టీ నేతలకు పంపారు. టిక్కెట్ ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు అనుకున్న వాళ్లు సైలెంట్ గా ఉంటున్నారు. నిండా మునిగిన వాళ్లు మాత్రం తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. పవన్ పై బూతులందుకుంటున్నారు. మొత్తంగా వైసీపీలో ఓ బ్యాచ్ మాత్రమే నోరు తెరుస్తున్నారు. జగన్ రెడ్డి టిక్కెట్లు ప్రకటించిన తర్వాత వారి ముఖచిత్రాలను.. టీడీపీ, జనసైనికులు హేళన చేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close