ప్రణీత్ రావు తీగ లాగితే డొంక కేసీఆర్, కేటీఆర్ దాకా వెళ్తుందా ?

తెలంగాణలో ప్రణీత్ రావు అనే డీఎస్పీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన ఎస్ఐబీలో ఉంటూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు చక్కబెట్టారు. టెర్రరిస్టులు, నక్సలైట్లపై చేయాల్సిన ట్యాపింగ్ రాజకీయ నాయకులపై ప్రయోగించారు. కాంగ్రెస్ గెలిచే ప రిస్థితి లేదని మళ్లీ బాపు కేసీఆరే సీఎం అవుతారని గట్టి నమ్మకంతో … అధికారికంగా విచ్చలవిడితనంతో తన అధికార దుర్వినియోగం చేశారు. ఇప్పుడు అది బయటపడుతోంది.

అయితే ఒక డీఎస్పీ ఇదంతా చేయగలరా .. అంటే చాన్సే లేదని అర్థం చేసుకోవచ్చు. అసలు బాసులు వేరే ఉన్నారు. రిటైరైపోయినా ఇంటలిజెన్స్ లో కీలక పాత్ర పోషించినా ప్రభాకర్ రావు అనే పెద్దమనిషి… అటు కేసీఆర్ ఫ్యామిలీకి.. ఇటు ట్యాపింగ్ కు మధ్య అనుసంధానకర్త. కేసీఆర్ ఓడిపోగానే మొదటగా రాజీనామా చేసింది ఆయనే. వెంటనే… ప్రణీత్ రావు తన అధీనంలో ఉన్న రికార్డులన్నింటినీ చెరిపేశారు. సీసీ కెమెరాలను ఆఫీసులో ఆపు చేయించి మరీ .. ఈ పని చేశారు. ఇప్పుడు వాటిని రీట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రణీత్ రావు ఓ ఎస్ఐ మాత్రమే. ఆయన బ్యాచ్లో అందరూ ఎస్‌ఐలు అయితే ఈయన ఒక్కడికే డీఎస్పీ ప్రమోషన్ ఇచ్చారు. ట్యాపింగ్ పనులు చేయించుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల కాలంలో ఎవరికీ స్వేచ్చ లేదు. అప్పటి ఏపీ సీఎం ఫోన్ ను ట్యాప్ చేశారు. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా బయటకు వచ్చింది. ఆ తర్వాత ఎంతో మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులకు కూడా ట్యాపింగ్‌తోనే వల వేశారన్న అనుమానాలు ఉన్నాయి. అవన్నీ బయటపడితే.. వ్యవహారం తీవ్రంగా మారే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

వైసీపీ : 2019లో కాన్ఫిడెన్స్‌కా బాప్ – ఇప్పుడు సైలెంట్

2019లో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం వైసీసీ రంగంలోకి దిగిపోయింది. అప్పటికే ఈసీ ద్వారా నియమింప చేసుకున్న ఉన్నతాధికారుల అండతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు....

రూ. 21వేల కోట్లు – దోచేస్తారా ?

ఏపీ ప్రభుత్వం దగ్గగర ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లుకపైగానే నిధులు ఉన్నాయి . పోలింగ్ కు ముందు ప్రజలఖాతాల్లో వేయాల్సిన పధ్నాలుగు వేల కోట్లతో పాటు ఆర్బీఐ నుంచి తాజాగా తెచ్చిన...

పాతబస్తీలో తగ్గిన పోలింగ్… టెన్షన్ లో అసద్..!?

హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో విజయంపై ఎంఐఎం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక్కడ కేవలం 46.08శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడంతో మజ్లిస్ కంచుకోటలో బీజేపీ పాగా వేస్తుందా..? అనే చర్చ జరుగుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close