మిగిలిన వాళ్ళంతా తప్పు చేసినట్లేనా ?

అమరావతి భూదందా లో అడ్డగోలుగా దోచేసుకున్నారంటూ… సాక్షి దినపత్రిక తెలుగుదేశం నాయకుల మీద కొన్ని రోజులుగా కథనాలు వెలువరిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సర్కారులోని మంత్రులు బినామీల పేరిట భూమి కొనుగోళ్లకు పాల్పడి రైతులను మోసం చేశారంటూ కథనాలు వచ్చాయి. దీనిమీద చంద్రబాబు మండి పడడమూ, సాక్షి మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం..అని రెచ్చిపోవడము కూడా జరిగింది. అంతా బాగానే ఉంది..కానీ సాక్షి మీద న్యాయపరంగా ప్రొసీడ్ కావడంలో కేవలం ఇద్దరు మంత్రులు మాత్రమే స్పందించారు. చంద్రబాబు ప్రకటించిన దూకుడు గమనిస్తే.. సాక్షిలో పేర్లు పడిన వాళ్ళంతా కేసులు పెట్టేస్తారేమో అనిపించింది కానీ, ఇప్పటికీ ఇద్దరు మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు మాత్రమే సాక్షికి లీగల్ నోటీసులు ఇచ్చారు.

అయితే వీరు ఇచ్చిన నోటీసుల వల్ల కొన్ని కీలకమైన అంశాలు చర్చకు వస్తున్నాయి. తెలుగుదేశం వారందరి మీద ఆరోపణలు వచ్చినపుడు వీరు మాత్రమే నోటీసులు ఇవ్వడం అంటే.. మిగిలిన వాళ్ళందరూ తప్పు ఒప్పుకుంటున్నట్లేనా? అనే చర్చ రాజకీయంగా నడుస్తున్నది. నిజానికి సాక్షి ఆరోపణల తరవాత ఎంపీ మురళీమోహన్, పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళు ఇచ్చిన వివరణలు కాస్త కన్విన్సింగ్ గా అనిపించింది. అయితే వాళ్ళు ఎవరూ ఇప్పుడు పెద్ద స్పందించినట్లు లేదు. లోకేశ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అనేకమంది మీద సాక్షి కథానాల్లో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వీరిద్దరూ మాత్రమే నోటీసులు ఇవ్వడం అంటే.. మిగిలిన వాళ్ళంతా కూడా.. తప్పు చేసారని అర్ధం వస్తుందా..అని పలువురు అనుకుంటున్నారు.

ఇక్కడ మరొక సమస్య కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు నారాయణ కాలేజి ఉద్యోగి, మంత్రి నారాయణ బంధువు అయిన ఒక వ్యక్తి భూములు కొనడానికి సంబంధించి వార్తల్లో ఉన్నది. ఇప్పుడు నారాయణ లీగల్ నోటీసులు ఇచ్చిన సరే.. కేసు విచారణకు వస్తే.. సదరు ఉద్యోగి కూడా న్యాయ పీఠం ముందుకు రావలసి ఉంటుంది. తమకు అంత భారీ మొత్తంలో సొమ్ము ఎలా వచ్చిందో.. అది అంతా వైట్ మనీ అవునో కాదో… ఆ సొమ్ముకు తాము పన్నులు చెల్లిస్తూ వచ్చామో లేదో.. కోర్టుకు చెప్పుకుని న్యాయం, చట్ట పరంగా తాము మంత్రికి బినామీ కాదని నిరూపించుకోవాలి. అది చాలా కష్టమైనా విషయం. అంటే ఈ ఉదాహరణలోని విషయం బినామీలు అందరికి వర్తిస్తుంది. వీరు కేసులు వేయడం అంటే.. ఒకరకంగా న్యాయ విచారణ ప్రక్రియ మొదలు అయిపోయినట్లే అవుతుందని. సాక్షి గనుక ఈ కాస్త ఆధారాలు చూపించినా సరే, మంత్రులు, టీడీపీ నాయకులు, ప్రధానంగా వారి బినామీ లు ఇరుక్కుపోయారని పలువురు అనుకున్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close