కవితను వదలని ఈడీ, ఐటీ !

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఇంట్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన పది బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. కవితతో పాటు ఆమె భర్త వ్యాపార వ్యవహారాలపై పూర్తి స్థాయి సమాచారంతో వచ్చి సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. సోదాల సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున ఆమె ఇంటి వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు.

కవిత .. ఢిల్లీ లిక్కర్ స్కాంలో పెద్ద ఎత్తున లాభపడ్డారని ఇప్పటికే సీబీఐ, ఈడీ చార్జిషీట్లు దాఖలు చేశాయి. స్కాం ద్వారా వచ్చిన డబ్బుతో ఆమె ఆస్తులు కొనుగోలు చేశారని ఇందు కోసం ఆమె భర్త సంస్థల్ని వాడుకున్నారని కూడా చార్జిషీటులో పెట్టారు. అన్ని కలిపి ఒకే సారి సోదాలకు వచ్చినట్లుగాతెలుస్తోంది. కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు కావడం లేదు. కోర్టులో ఓ పిటిషన్ వేసి అదే పనిగా ..అదే కారణం చూపి డుమ్మా కొడుతున్నారు ఇటీవల సీబీఐ ఇచ్చిన నోటీసులకూ హాజరు కాలేదు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి అధికారులు సోదాలకు రావడం అనూహ్యమైన పరిణామంగా మారింది.

లోక్‌సభ ఎన్నికల్లో కూడా కవిత పోటీ చేయడం లేదు. నిజామాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ ను కేసీఆర్ ఖరారు చేశారు. ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. జాతీయ అంశాల్లో కాంగ్రెస్ పై తరచూ విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ డిల్లీ లిక్కర్ స్కాం లో ఆమె పై దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతునే ఉన్నాయి. సౌత్ లాబీ నుంచి నిందితులుగా ఉన్న వారిలో .. ఒక్క కవిత తప్ప అందరూ అప్రూవర్లుగా మారారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో ర‌క్త చ‌రిత్ర‌… ఇప్పుడే ఇలా ఉంటే ఫ‌లితాల రోజున ఎలా ఉంటుందో?

ఏపీ అట్టుడికిపోతోంది. ఎప్పుడు, ఎక్కడ దాడులు జరుగుతాయో తెలియని ఆందోళనకర పరిస్థితి రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఫ్యాక్షన్ రాజకీయాలను సినిమాలో చూడటం తప్ప ప్రత్యక్షంగా చూడని ఈ జనరేషన్ ఏపీలో...

ఆ స‌ర్‌ప్రైజ్ ఇదేనా డార్లింగ్‌?!

సోష‌ల్ మీడియాకు పెద్ద‌గా ట‌చ్‌లో ఉండ‌ని హీరో ప్ర‌భాస్‌. ఎప్పుడో గానీ, ప్ర‌భాస్ ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టా ఖాతాలు యాక్టీవ్‌లోకి రావు. కానీ ఇప్పుడు ప్ర‌భాస్ చేసిన ఓ పోస్ట్... అభిమానుల్లో ఆస‌క్తి రేపుతోంది....

కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక… వైసీపీ ఓటమికి సంకేతమా…?

ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో దాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల తాజా హెచ్చరికలు దేనికి సంకేతం..?ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికలు వైసీపీ ఓటమి ఖాయమని...

బటన్ నొక్కి లబ్దిదారుల నోట్లో మట్టి – డబ్బుల్లేవా ?

పోలింగ్ కు రెండు రోజుల ముందు లబ్దిదారుల ఖాతాల్లో రూ. 14వేల కోట్లు వేసేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ డబ్బులు జమ చేయడం లేదు. ఇదిగో అదిగో అంటూ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close