వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్‌మెయిలింగ్ దందా కూడా !?

తెలంగాణలో పోలీసుల ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టడం ఒకటి అయితే బంగారం వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కూడా నిఘా పెట్టి.. ట్యాపింగ్ చేసి వారి రహస్యాలు తెలుసుకుని బ్లాక్ మెయిలింగ్ దందా చేయడం కూడా జరిగిందని పోలీసుల వైపు నుంచి లీకులు వస్తున్నాయి. ఎవరైనా వ్యాపారులు ఫిర్యాదులు ఇచ్చారో లేదో స్పష్టత లేదు .. కానీ ఐటీ కారిడార్‌లో భారీగా భూములున్న సంధ్యా కన్వెన్షన్ ఓనర్ శ్రీధరరావు మాత్రం ఫిర్యాదు చేశారు.

గతంలో ఆయనపై చాలా కేసులు నమోదు అయ్యాయి. అందులో ఒకటి ఆయన స్వలింగసంపర్కుడని చేసిన ఆరోపణలతో పెట్టి కేసు కూడా ఉంది. ఇప్పుడు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇంకా ఎవరైనా ట్యాపింగ్ పై పోలీసుల్ని ఆశ్రయించారో లేదో ఇంకా బయటకు రాలేదు. కానీ ఇలాంటి దందాలు జరిగాయని.. పెద్ద ఎత్తున పోలీసు అధికారులు ఆస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలు మాత్రం వస్తున్నాయి.

ఇప్పటికే ట్యాపింగ్ కేసులో కీలక వ్యక్తులు విదేశాలకు పారిపోయారు. వారిలో ముఖ్యుడు ప్రభాకర్ రావు అనే ఐపీఎస్ అధికారి. ఆయన కాంగ్రెస్ గెలిచిన రోజు సాయంత్రమే రాజీనామా చేశారు. తర్వాత అమెరికా పారిపోయారు. ఆయన తెలంగాణ పోలీసు శాఖలోని ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసి. మనం మనం పోలీసులం.. ఇళ్లల్లో సోదాలెందుకని అడిగినట్లుగా తెలుస్తోంది. ఏమైనా చెప్పాలనుకుంటే రాతపూర్వకంగా పంపించాలని ఆ అధికారి సమాధానం ఇచ్చారంటున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు అధికారులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వారిని విదేశాల నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close