కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ మాట చెప్పి వెళదామని .. ఫాంహౌస్ కు వెళ్లారు. కానీ కేసీఆర్ కన్నెర్ర చేసి తిట్లందుకోవడంతో ఆయన మధ్యలోనే వచ్చేశారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

తనకు ఉన్న ఇబ్బందులు చెప్పి పార్టీ మారుతున్నానని కేసీఆర్ కు చెప్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పార్టీ అధినేత అసహనానికి గురైనట్లుగా తెలుస్తోంది. పదేళ్ల పాటు పార్టీలో పెద్ద పీట వేసి పదవులు ఇస్తే.. కష్టకాలంలో వదిలేసి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాకులు చెప్పవద్దని మండిపడినట్లుగా తెలుస్తోంది. దీంతో కేకే ఆ మాటల్ని పడలేక మధ్యలోనే వెళ్లిపోయారు.

కేకే తన రాజకీయ జీవితంలో ఎప్పుడో 1978లో ఒక్క సారి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి గెలవడం కాదు కదా కనీసం పోటీ చేయలేదు. అయినా రాజకీయాల్లో ఉంటూ ఏదో ఓ పదవి దక్కించుకుటూనే వస్తున్నారు. కాంగ్రెస్ లో ఉండే.. హైకమాండ్ ను కాకాపట్టి పదవులు పొందే సంప్రదాయాన్ని ఆయన బాగా వంట బట్టించుకోవడంతో.. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. కానీ ఆయన తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయిన తర్వాత కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని బీఆర్ఎస్ లో చేరిపోయారు. కుమారుడ్ని, కుమార్తెను బీఆర్ఎస్‌లో చేర్పించారు. కుమారుడికి కొన్ని కాంట్రాక్టులు.. ఆర్థిక ప్రయోజనాలు.. కుమార్తెకు హైదరాబాద్ మేయర్ పదవి ఇప్పించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం పోగానే ఆయన కాంగ్రెస్ వైపు పోతున్నారు.

ఈ క్రమంలో ఆయన యూట్యూబ్ మీడియాలకు ఇంటర్యూలు ఇస్తూ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని చెబుతున్నారు. గురువారం ఆయన తాను పార్టీ మారుతున్నట్లుగా కేసీఆర్‌కు చెప్పేందుకు ఫామ్ హౌస్‌కు వెళ్లారు. కాంగ్రెస్ తనకు తక్కువ చేయలేదని, ఆది నుంచి మర్యాదలు చేసిందని ఎంపి కెకె తెలిపారు. తెలంగాణ కోసం అప్పుడు పార్టీ మారానని వివరణ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నామని, నెరవేరిందని, సొంత పార్టీ వైపు చూస్తే తప్పేంటని వాదిస్తున్నారు. కేకే ఎలాగైనా తన వాదన వినిపించగలరని కాంగ్రెస్ లోనే సెటైర్లు పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖాతాల్లో డబ్బులేయలేదు ..డ్రామాలే !

ఓటర్ల ఖాతాల్లో పధ్నాలుగు వేల కోట్లు జమ చేస్తున్నట్లుగా వైసీపీ చేసిన డ్రామాలు తేలిపోయాయి. అంతా ఉత్తదేనని తేలిపోయింది. హైకోర్టు శుక్రవారం ఒక్క రోజు నగదు జమ చేయడానికి చాన్సిచ్చింది. బ్యాంకులు ప్రారంభం...

ఎంపీని చేస్తానని తల్లిని కూడా మోసం చేసిన జగన్ : షర్మిల

జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై షర్మిల సంచలన విషయాలు బయట పెట్టారు. షర్మిల రాజకీయాన్ని కించ పరిచేందుకు ఆమెకు పదవీ కాంక్ష అని..డబ్బులు అడిగితే ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చేరారని జగన్ విమర్శలు...

నగదు బదిలీపై ఏపీ సర్కార్‌కు మరోసారి “లెంగ్తీ క్వశ్చన్స్” వేసిన ఈసీ !

ఓటర్ల ఖాతాలో నగదు జమ చేయాలని తెగ ఆత్రపడుతున్న ఎన్నికల సంఘానికి ఈసీ మరోసారి షాకిచ్చింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. జనవరి 2024...

వారంతా బీజేపీలో చేరగానే పునీతులయ్యారా..?కేటీఆర్ ఫైర్

ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close