తొలి సారి రిస్క్ చేస్తున్న గంటా శ్రీనివాస్ !

గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక్క సారి కూడా ఓడిపోలేదు. అలాగని ఆయన రెండో సారి తాను గెలిచిన నియోజకవర్గంలో పోటీ చేయలేదు. ఈ సారి మాత్రం గతంలో గెలిచిన నియోజకవర్గం భీమిలి నుంచి మరోసారి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పట్టుబట్టి టిక్కెట్ దక్కించుకున్నారు.

గత ఎన్నికల్లో గెలిచిన విశాఖ నార్త్ నుంచి పోటీ చేయదల్చుకోలేదు. మరో నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. అయన కోరిక తీర్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని సూచించారు. కానీ గంటా మాత్రం.. సింపుల్ గా గెలిచే సీటుపైనే దృష్టి పెట్టారు. సెంటిమెంట్‌కు విరుద్ధంగా గతంలో పోటీ చేసి గెలిచిన భీమిలిని ఎంచుకున్నారు. భీమిలి నియోజకవర్గంలోనే రెండోసారి పోటీ చేస్తున్నారు.

గంటా శ్రీనివాసరావు భీమిలీలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అక్కడ మంచి ఫలితాలు సాధించింది. గట్టి క్యాడర్ ఉంది. గంటా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే వారు లేరు. అదే సమయంలో జనసేన తో పొత్తు కలసి వస్తుంది. టీడీపీ, జనసేన కలిస్తే భీమిలీలో ఏకపక్ష ఎన్నిక జరుగుతుందన్న అభిప్రాయం ఉంది. అందుకే ఈ సారి సెంటిమెంట్ బ్రేక్ చేసినా గెలుపు దగ్గరకే వెళ్తానని గంటా గట్టి నమ్మకంతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చెల్ల‌మ్మ‌కు కేసీఆర్ యాది కొస్తున్నారా… రాముల‌మ్మ ట్వీట్ అంత‌రార్థం ఏంటో?

కాంగ్రెస్ లో కొనసాగుతూ బీఆర్ఎస్ కు మద్దతుగా విజయశాంతి బీజేపీకి కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. ఇక బీఆర్ఎస్ ఉనికి ఉండదని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆమె చేసిన...

ఏపీలో ర‌క్త చ‌రిత్ర‌… ఇప్పుడే ఇలా ఉంటే ఫ‌లితాల రోజున ఎలా ఉంటుందో?

ఏపీ అట్టుడికిపోతోంది. ఎప్పుడు, ఎక్కడ దాడులు జరుగుతాయో తెలియని ఆందోళనకర పరిస్థితి రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఫ్యాక్షన్ రాజకీయాలను సినిమాలో చూడటం తప్ప ప్రత్యక్షంగా చూడని ఈ జనరేషన్ ఏపీలో...

ఆ స‌ర్‌ప్రైజ్ ఇదేనా డార్లింగ్‌?!

సోష‌ల్ మీడియాకు పెద్ద‌గా ట‌చ్‌లో ఉండ‌ని హీరో ప్ర‌భాస్‌. ఎప్పుడో గానీ, ప్ర‌భాస్ ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టా ఖాతాలు యాక్టీవ్‌లోకి రావు. కానీ ఇప్పుడు ప్ర‌భాస్ చేసిన ఓ పోస్ట్... అభిమానుల్లో ఆస‌క్తి రేపుతోంది....

కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక… వైసీపీ ఓటమికి సంకేతమా…?

ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో దాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల తాజా హెచ్చరికలు దేనికి సంకేతం..?ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికలు వైసీపీ ఓటమి ఖాయమని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close