తుని విద్వంసంలో చిత్తూరు వైకాపా నేతకి సంబంధం?

జనవరి 31న తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన విద్వంసంతో తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డికి సంబంధం ఉందని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సి.ఐ.డి. పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆరోజు తునిలో సభ జరిగే ముందు ఆయన చాలాసార్లు ముద్రగడ పద్మనాభంతో ఫోన్ లో మాట్లాడినట్లు సి.ఐ.డి. పోలీసులు తమ దర్యాప్తులో కనుగొన్నారు. అంతకంటే ముందు ఒకసారి ఆయన స్వయంగా వచ్చి ముద్రగడని కలిసినట్లు పోలీసులు కనుగొన్నారు.

చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ఉండే కరుణాకర్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో కిర్లంపూడిలో ఉంటున్న కాపు నేత ముద్రగడని ఎందుకు కలుసుకొన్నారు? ఆ సమయంలో ఆయనకు ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేసారు? వారివురు ఫోన్లో దేని గురించి మాట్లాడుకొన్నారు? వంటి ప్రశ్నలకు జవాబులు రాబట్టేందుకు కరుణాకర్ రెడ్డిని తమ ముందు హాజరుకమ్మని కోరుతూ సి.ఐ.డి. పోలీసులు త్వరలో ఆయనకు నోటీసు పంపబోతున్నట్లు తెలుస్తోంది.

తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ని ఆందోళనకారులు అడ్డుకొన్నపుడు, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకి రుమాళ్ళు కట్టుకొని పెట్రోల్ క్యానులు పట్టుకొని పరుగులు తీస్తుండటం, ఆ తరువాత క్షణాలలో రైలంతా మంటలు వ్యాపించడం కొందరి మొబైల్ ఫోన్లలో రికార్డు చేసారు. ఆ క్లిప్పింగ్స్ ని స్వాధీనం చేసుకొన్న పోలీసులు, వేరే ప్రాంతాలనుండి వచ్చిన కిరాయి దుండగులే ఈ పనికి పూనుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. సాధారణ ప్రజలయితే అంత చురుకుగా అంత విద్వంసం సృష్టించలేరని పోలీసులు భావిస్తున్నారు. కనుక బయట నుండి వచ్చిన వ్యక్తులే ఎవరో ఈ పనికి పాల్పడి ఉంటారనే అనుమానంతో ఫోన్ కాల్ డాటాని పరిశీలించగా అందులో కరుణాకర్ రెడ్డి పేరు కూడా కనబడింది. కనుక ఈ విద్వంసంతో ఆయనకి కూడా ఏమయినా సంబంధం ఉండవచ్చుననే అనుమానంతో ఆయనకి నోటీసు జారీ చేయబోతున్నట్లు తాజా సమాచారం. ఒకవేళ వారి అనుమానం నిజమయినట్లయితే, ముద్రగడ పద్మనాభానికి, వైకాపా నేతలకు సమస్యలు తప్పకపోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close