బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ … లక్ష్యం అదే..!?

బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ కూడా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.గతంలో ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే చేస్తుండటంతో ఆ పార్టీపై పెదవి విరుపులు మొదలయ్యాయి.

ఉప ఎన్నికలు వస్తే చాలు అధికార పార్టీ ఆ నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించడం ఆనవాయితీగా వస్తోంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇది పీక్స్ కు చేరుకుంది. కొత్త పథకాలకు రూపకల్పన చేసి మరీ జనాలను అట్రాక్ట్ చేశారు. దీనిపై నాడు కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అన్ని నియోజకవర్గాలను సమాన దృష్టితో చూడాల్సిన ప్రభుత్వం ఇతర నియోజకవర్గాలకు కోత విధించి బైపోల్ జరిగే నియోజకవర్గానికి అధిక నిధులు, పథకాలు మళ్ళించడాన్ని సవాల్ చేసింది.

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో నెగ్గేందుకు బీఆర్ఎస్ బాటలోనే పయనిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి కంటోన్మెంట్ ప్రజలకు ఆరు వేల ఇందిరమ్మ ఇండ్లను తొలి విడతలో మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడం పట్ల విస్మయం వ్యక్తం అవుతోంది. నగరంలో మిగతా నియోజకవర్గాలకు 3500 ఇందిరమ ఇండ్లను ఇస్తామని కంటోన్మెంట్ కు మాత్రం అదనంగా 2500ఎక్కువగా ఇవ్వడం వివక్ష కాదా..?అనే చర్చ జరుగుతోంది. ఇది అన్ని నియోజకవర్గాలను సమాన దృష్టితో చూడటం ఎలా అవుతుందని కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నిస్తున్నారు.

గతంలో విమర్శలు చేసినా, హామీలు ఇచ్చినా ప్రస్తుతం కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలవడమే కాంగ్రెస్ టార్గెట్ అని.. అందుకోసమే ఆ నియోజకవర్గానికి ప్రియార్టి ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఊపిరి పీల్చుకున్న డబ్బింగ్ బొమ్మ

తమిళ సినిమాలు తెలుగులో తెగ అడేస్తాయి. విక్రమ్, జైలర్ విజయాల్లో తెలుగు ప్రేక్షకుల వాటానే ఎక్కువ. అయితే కొన్నాళ్ళుగా తమిళ సినిమాల సందడి తగ్గింది. ఇలా రావడం అలా వెళ్ళిపోవడమే కానీ ఒక్కటంటే...

ట్రైనీ ఐఏఎస్ గా కూతురు… ఉప్పొంగిన హృదయంతో తండ్రి సెల్యూట్

ఆ దృశ్యం... అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటే చూసి మురిసిపోవాలని తండ్రులందరూ భావిస్తారు. కానీ కొంతమంది తండ్రుల ఆశలు మాత్రమే...

చెవిరెడ్డి శ్రీవారి దర్శన వ్యాపారం రేంజే వేరు !

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి సతీమణికి తన ఇంటి పక్కన గోశాల లాంటి కుటీరం కావాలని అనిపిస్తే.. అఘమేఘాల మీద కట్టేస్తాడు....

ఫర్నిచర్‌కు జగన్ డబ్బులిచ్చేస్తారట !

సీఎంగా చేసి ఫర్నీచర్‌ను కొట్టేశారని జగన్ పై వస్తున్న ఆరోపణలకు వైసీపీ స్పందించింది. ఓడిపోగానే.. ప్రజాధనంతో క్యాంప్ ఆఫీసు కోసం కొనుగోలు చేసిన వస్తువులన్నింటికీ డబ్బులిస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close