నేను దేశం విడిచి పారిపోలేదు: విజయ్ మాల్యా

కింగ్ ఫిషర్ అధినేత మరియు రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యా దేశంలో వివిధ బ్యాంకులకు రూ.9,000 కోట్లు బకాయిలు చెల్లించవలసి ఉంది. బ్యాంకుల నుండి అప్పులు తీర్చమని ఒత్తిడి పెరిగిపోవడం ఈనెల 2వ తేదీన ఆయన లండన్ వెళ్ళిపోయారు. దీనిపై పార్లమెంటులో కూడా నిన్న చర్చ జరిగింది. అలాగే సుప్రీం కోర్టులో కూడా విచారణ జరిగింది. రెండు వారలలోగా తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ సుప్రీం కోర్టు ఆయనకు నోటీసు జారీ చేసింది. ఆయనకు బ్యాంకులు కూడా నోటీసులు జారీ చేయడానికి అనుమతించింది.

ఈ పరిణామాలపై లండన్ లో ఉన్న విజయ్ మాల్యా చాలా ఘాటుగా స్పందిస్తూ ట్వీటర్ లో ఈరోజు రెండు మెసేజులు పెట్టారు. “నేను ఒక అంతర్జాతీయ వ్యాపారవేత్తని కనుక తరచూ విదేశాలకు వెళ్లి వస్తుంటాను. నేనేమీ దేశం విడిచిపారిపోలేదు…పోలీసులను నుంచి తప్పించుకొని తిరగడం లేదు. ఒక ఎంపిగా భారతదేశ చట్టాలను, న్యాయవ్యవస్థలకు లోబడి ఉంటాను వాటిని గౌరవిస్తాను. మన న్యాయవ్యవస్థపై నాకు అపారమయిన నమ్మకం ఉంది. అయితే నా గురించి దేశంలో మీడియా విచారణ చేయడాన్ని అంగీకరించబోను,” అని ట్వీట్ చేసారు.

ఆయన మళ్ళీ భారత్ తిరిగి వస్తారో లేదో, వచ్చి బ్యాంకుల అప్పులను తీరుస్తారో లేదో తెలియదు కానీ ఆయన భారత్ చట్టాలకు, న్యాయవ్యవస్థకు లోబడి ఉంటానని చెప్పడమే గొప్ప విషయం. ఇటువంటి పెద్ద మనుషులు బ్యాంకులకు వెల కోట్లు టోపీలు పెడుతుంటే, వారితో రాజకీయ పార్టీలకు ఉండే ఆర్ధిక, రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ఉపేక్షిస్తుంటే, చివరికి ఆ భారం కూడా బ్యాంక్ ఖాతలు లేని సామాన్య ప్రజలపైన కూడా పడుతోంది. నిజామాబాద్ ఎంపి కవిత నిన్న లోక్ సభ సభలో మాట్లాడుతూ విజయ్ మాల్యా విషయం ప్రస్తావించి, ఆయన బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతుంటే మోడీ ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకొందని ప్రశ్నించారు. ఆమె ప్రశ్న ప్రజాభిప్రాయానికి అద్దం పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close