సరికొత్త వివాదం: “భారత్ మాతాకి జై!”

మహారాష్ట్రలోని ఎం.ఐ.ఎం.(మజ్లీస్ పార్టీ) శాసనసభ సభ్యుడు వారిస్ పఠాన్ శాసనసభలో ‘భారత్ మాతా కి జై’ అని నినదించేందుకు నిరాకరించడంతో అతనిని సభ నుంచి ప్రస్తుత సమావేశాలు పూర్తయ్యేవరకు సస్పెండ్ చేయబడ్డాడు. మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ, “తన పీక మీద కత్తి పెట్టి బలవంతం చేస్తే తను చావనయినా చస్తాను కానీ ‘భారత్ మాతా కి జై’ అని ఎట్టి పరిస్థితులలో అనను,” అని అన్న మాటలపై ఇప్పటికే చాలా వివాదాస్పదంగా మారింది. ఆయనపై అప్పుడే కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అవుతున్నాయి కూడా. తమ పార్టీ అధినేత మార్గంలోనే నడుస్తూ ఇప్పుడు వారిస్ పఠాన్ కూడా అదేవిధంగా మాట్లాడాడు. అందుకు మహారాష్ట్ర శాసనసభలోని అధికార, ప్రతిపక్ష సభ్యులు అందరూ అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. సభ్యుల ఒత్తిడి మేరకు, మహారాష్ట్ర హోం మంత్రి రంజిత్ పాటిల్ అతనిని సభ నుండి సమావేశాలు పూర్తయ్యేవరకు బహిష్కరించాలని తీర్మానం ప్రవేశపెట్టగా దానిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

అనంతరం ఈ వివాదం గురించి మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే సభలో సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “ఈ దేశంలో జీవిస్తున్న వారందరూ ఈ దేశాన్ని ప్రేమిస్తారని, గౌరవిస్తారని అందరం ఆశిస్తాము. అది చాలా సహజం కూడా. బ్రిటిష్ ప్రభుత్వ బానిసత్వ సంకెళ్ళను త్రెంచుకొనేందుకు కుల,మత,ప్రాంత,బాషలకు అతీతంగా దేశ ప్రజలందరూ కలిసిపోరాడారు. ఆనాటి వారి త్యాగాలు, పోరాటాల ఫలితంగా నేడు స్వతంత్ర భారత్ లో జీవించగలుగుతున్నాము. వాక్ స్వాతంత్ర్యం పేరిట వారి పోరాటాలను, త్యాగాలను అవమానించడం సబబు కాదు. ఇటువంటి జాతి విద్వేష భావనలు జె.ఎన్.యు.లో చూసాము అవిప్పుడు చట్ట సభాలోకి కూడా ప్రాకడం మనం చూస్తున్నాము. ఏ వ్యక్తి అయినా ఈవిధంగా వ్యవహరించినట్లయితే ఆ వ్యక్తిని దేశద్రోహిగానే పరిగణించడం మంచిది,” అని అన్నారు.

ఈ తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అబ్దుల్ సత్తార్, రాధాకృష్ణ పాటిల్ ఇద్దరూ కూడా సభ్యులు కూడా మద్దతు ఈయడం విశేషం. “ఇటువంటి వ్యక్తులు అనాలోచితంగా మాట్లాడే ఇటువంటి మాటల వలననే యావత్ ముస్లిం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంటుంది. కనుక వాసిం పఠాన్ న్ని సభ నుంచి బహిష్కరించడాన్ని మేము సమర్దిస్తున్నాము,” అని చెప్పారు.

ఈ పరిణామంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జితేందర్ అవ్హాద్ భిన్నంగా స్పందించారు. “ఇది ఆర్.ఎస్.ఎస్., భాజపా, మజ్లీస్ లు కలిసి మొదలుపెట్టిన మరో కొత్త నాటకం. ఆర్.ఎస్.ఎస్. అధినేత మోహన్ భగవత్ దేశ ప్రజలందరూ ‘భారత్ మాతాకి జై’ అనే నినాదాన్ని తరువాత తరానికి అందించాలని కోరినప్పుడే మళ్ళీ ఏదో కొత్త నాటకం మొదలుపెట్టడానికి సిద్దం అవుతున్నారని మాకు అనుమానం కలిగింది. ఆయన ఆ మాట చెప్పడం వెంటనే మజ్లీస్ అధినేత దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడటంతో ఆ మూడు సంస్థలు కలిసి మరో కొత్త నాటకం ఆరంభించి సరికొత్త వివాదం లేవనెత్తడంతో మా అనుమానం నిజమేనని రుజువయింది. అవి మొదలుపెట్టిన ఈ కొత్త నాటకం వలన దేశంలో ఉన్న రెండు మత వర్గాల ప్రజల మధ్యన ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడుతుంది,” అని అన్నారు.

 

 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close