ఏపి అసెంబ్లీ వద్ద కొనసాగుతున్న హైడ్రామా

వైకాపా ఎమ్మెల్యే రోజా కొద్దిసేపటి క్రితం ఏపి అసెంబ్లీకి చేరుకొన్నారు. ఆమెను సభలోనికి రానీయవద్దని స్పీకర్ కోడెల శివప్రసాద రావు అసెంబ్లీ మార్షల్స్ కి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఆమెను శాసనసభలోని వైకాపా కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతించడంతో ఆమె తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అక్కడికి చేరుకొన్నారు.

జగన్మోహన్ రెడ్డి తనతో పాటు రోజా తరపున వాదించిన లాయర్ ని కూడా లోపలకి తీసుకువెళ్తానని పట్టుబట్టినప్పుడు మొదట పోలీసులు అందుకు అభ్యంతరం చెపారు. కానీ ఎవరినయినా తన పాస్ మీద లోపలకి తీసుకువెళ్ళే అధికారం తనకి ఉందని జగన్ వాదించడంతో, పోలీసులు అసెంబ్లీ కార్యదర్శిని సంప్రదించిన తరువాత అనుమతించారు.

రోజాని సభలోకి అనుమతించబోరనే విషయం తెలిసినందున జగన్మోహన్ రెడ్డితో సహా వైకాపా సభ్యులు అందరూ బయటే ఉన్నారు. కానీ లోపల యధాప్రకారం స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. రోజా సస్పెన్షన్ పై హైకోర్టు నుండి తీర్పు కాపీ ఇంకా స్పీకర్ కార్యాలయానికి అందలేదు కనుక అంతవరకు రోజాను సభలోకి అనుమతించకుండా ఉండేందుకు అవకాశం ఉంది. అది అందిన తరువాత దానిపై సభ అభిప్రాయం తెలుసుకొని తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో హైకోర్టు సింగిల్ జడ్జి నిన్నఇచ్చిన తీర్పుని హైకోర్టు బెంచి లో సవాలు చేయాలని నిశ్చయించుకొన్నట్లు తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు నిన్ననే చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close