అన్నయ్య మీద నాకున్న ప్రేమాభిమానాలను రుజువు చేసుకొనవసరం లేదు: పవన్ కళ్యాణ్

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “నాకు అన్నయ్య మీద ఉన్న ప్రేమాభిమానాలు ఎప్పటికీ చెక్కుచెదరవు. ఆ సంగతి మా ఇద్దరికీ తెలుసు. కనుక అన్నయ్య మీద ప్రేమాభిమానాలున్నాయని నేను పదేపదే రుజువు చేసుకోవలసిన అవసరం లేదని భావిస్తున్నాను. అన్నయ్య, వదిన ఇద్దరూ నాకు తల్లి తండ్రులతో సమానం. వారి కారణంగానే నేను ఈరోజు ఈ స్థాయికి ఎదగగలిగాను. ఒకప్పుడు నేను ఏ పని చేయకుండా తిరుగుతుంటే, నన్ను ప్రోత్సహించి ఈ సినీ పరిశ్రమలోకి తీసుకువచ్చింది మా అన్నయ్య వదినలే. ఒక మామూలు పోలీస్ కానిస్టేబుల్ కొడుకు అయిన అన్నయ్యకి సినీ పరిశ్రమలో ఎవరి అండదండలు లేకపోయినా ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకొన్నారు. ఆయన ఏర్పరచుకొన్న ఆ బాటలో నేను పెద్దగా కష్టపడకుండానే సినీ పరిశ్రమలోకి వచ్చేయగలిగాను. దానికీ ఆయన ప్రోత్సాహం చాలా ఉంది. ఒకప్పుడు నలుగురిలోకి రావడానికే సిగ్గుపడేవాడిని ఇప్పుడు ఇలాగ మీ ముందుకు వచ్చి నిలబడి మాట్లాడగలుగుతున్నాను అంటే అందుకు కారణం మా అన్నయ్య ప్రోత్సాహమే. కనుక అన్నయ్య, వదినలకు నేను నా జీవితాంతమూ రుణపడే ఉంటాను. రాజకీయాలు వేరు కుటుంబ సంబందాలు వేరు. కనుక రెంటినీ ముడిపెట్టి చూడటం అనవసరం. మేమిద్దరం మాకు నచ్చిన మార్గాలలో నడుస్తున్నాము,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close