రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా త్వరలో తెదేపాకి గుడ్ బై?

తెలంగాణా తెదేపాలో సీనియర్ నేత, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడుగా పేరున్న రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా త్వరలో తెదేపాకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరేందుకు సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం. ఆయనకి తెరాస ఎమ్మెల్సీ సీటుని ఆఫర్ చేసిందని, కానీ మాజీ రాజ్యసభ సభ్యుడయిన తనకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు అంగీకరించినట్లయితేనే తెరాసలో చేరుతానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెరాస పెద్దలతో ఆయన చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన తెదేపాలోనే కొనసాగాలనుకొంటునప్పటికీ, తెలంగాణాలో పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతుండటం, మళ్ళీ కోలుకొనే అవకాశాలు కనిపించకపోవడం, అయినా కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీని పట్టించుకోకపోవడం చేతనే అనేకమంది ఇతర నేతల్లాగే ఆయన కూడా విధిలేని పరిస్థితులోనే పార్టీని వీడేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే అయన డిమాండ్ కి తెరాస ఒప్పుకొంటుందో లేదా తెలియాల్సి ఉంది. ఎందుకంటే, ప్రతిపక్ష పార్టీల నేతలను తెరాసలోకి ఆకర్షించడానికి వారు కోరిన పదవులు కట్టబెడుతున్నందుకు ఇప్పటికే తెరాస నేతలలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. తెలంగాణాలో తమ పార్టీ చాలా బలంగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఇంకా బలపడేందుకు బయట నుంచి కొత్తగా పార్టీలోకి వస్తున్న వారికి ఈ విధంగా అన్ని ముఖ్యమయిన పదవులు పంచేస్తుండటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కనుక చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ కి తెరాస అధినేత అంగీకరిస్తారో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close