హమ్మయ్య! ఆమె సంతృప్తి చెందిందిట!

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి మార్గం సుగమమయినట్లే కనిపిస్తోంది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పి.డి.పి.) అధినేత్రి మహబూబా ముఫ్తీ ఇవ్వాళ్ళ ప్రధాని నరేంద్ర మోడితో సమావేశమయ్యి, ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధానితో జరిగిన సమావేశం చాలా సంతృప్తికరంగా ముగిసిందని చెప్పారు. మార్చి 24న పి.డి.పి. శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ఆమె తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ మరణించిన తరువాత, ఆయన హయంలో భాజపా- పి.డి.పి.ల మధ్య చేసుకొన్న ఒప్పందాన్ని అమలుచేయాలని పట్టుబడుతూ, గత మూడున్నర నెలలుగా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా మహబూబా చాలా తాత్సారం చేసారు. ఆ కారణంగా రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగి ఏప్రిల్ 8నాటికి ఆరు నెలలు పూర్తవుతాయి. కనుక ఏప్రిల్ 8లోగా ఎట్టి పరిస్థితులలో మళ్ళీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకు ఇంకా రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది కనుకనే మహబూబా ముఫ్తీ ప్రభుత్వ ఏర్పాటుకి తొందరపడుతున్నట్లున్నారు. మార్చి 24న లాంచనంగా శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి, అదే రోజున భాజపాతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి తమ పార్టీ సిద్దంగా ఉందని ఆమె గవర్నర్ కి తెలియజేయవచ్చును. అంటే ఈ నెలాఖరులోగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయని భావించవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close