తెదేపా ఎంపీల ధర్నా పవన్ కళ్యాణ్ కోసమేనా?

“ఆంధ్రా ఎంపీలకి తమ వ్యాపారాల మీద ఉన్నంత శ్రద్ద ప్రత్యేక హోదా సాధించడంపై లేదు. మనోళ్ళకి మోడీ అంటే చాలా భయం. అందుకే నోరుమెదపకుండా కూర్చొని పార్లమెంటు గోడలని చూస్తూ కాలక్షేపం చేసి వచ్చేస్తుంటారు. మనోళ్ళ కంటే తెలంగాణా ఎంపీలే చాలా నయం. వారి రాష్ట్రం కోసం పార్లమెంటులో గట్టిగా పోరాడుతుంటారు.” ఈ మాటలు ఎవరన్నారో అందరికీ తెలుసు. బహుశః ఆ దెబ్బకి జడిసిన తెదేపా ఎంపీలు గురువారం మధ్యాహ్నం పార్లమెంటు ఆవరణలో గాంధీజీ విగ్రహం దగ్గర ప్లకార్డులు పట్టుకొని ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయాలని, విభజన బిల్లులో ఉన్న హామీలన్నిటినీ అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేసారు.

‘పోనీలే ఇన్నాళ్ళకు మనోళ్ళు దైర్యంగా నోరువిప్పి మనకి కావలసిందేమిటో చెప్పారు’ అని రాష్ట్రంలో జనాలు సంతోషపడుతుంటే, జేసీ దివాకర్ రెడ్డి రెండు పంచ్ డైలాగులతో గాలి తీసేశారు. దేని గురించయినా నిర్భయంగా కుండలు బ్రద్దలు కొట్టి చెప్పేసే అలవాటున్న జెసి తమ ధర్నా గురించి మరో కుండ బ్రద్దలేసేసారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఇటువంటి ధర్నాల వలన ఏమీ ప్రయోజనం ఉండదని మాకు తెలుసు. కానీ ఏదో ప్రజలని ఊరడించడానికి, పవన్ కళ్యాణ్ న్ని చల్లబరచడానికే ఇది ఉపయోగపడుతుంది,” అని మనసులో మాట బయట పెట్టేశారు. దానితో తెదేపా ఎంపీలు ధైర్యం చేసి ధర్నా చేసినా వ్రతం చెడినా ఫలం దక్కనట్లయింది.

కానీ ఇక్కడ మరో విషయం చెప్పుకోక తప్పదు. ఓ నాలుగయిదు రోజుల క్రితమే కేంద్రమంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ, “ప్రత్యేక హోదాకి సంబంధించి దాదాపు 60 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు కూడా మరొక నెల్లన్నరలోగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. కనుక అప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి తన నిర్ణయం ప్రకటించవచ్చును. రైల్వే జోన్ మంజూరు చేయడానికి కొన్ని ఆర్ధిక అవరోధాలు ఎదురవుతున్నాయి. కానీ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తరువాత కేంద్రమంత్రి వర్గ సమావేశంలో రాష్ట్రానికి రైల్వే జోన్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవచ్చును,” అని తెలిపారు. అంటే ఈరోజు ధర్నా చేసిన తెదేపా ఎంపీలందరికీ కూడా ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది. కానీ ధర్నా చేసారంటే? దివాకర్ రెడ్డి చెప్పిందే నిజమనుకోవాలి మరి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close