ఉగ్రవాదులలో మనవాళ్ళు వాళ్ళవాళ్ళని వేరేగా ఉండరు: మోడీ

వాషింగ్టన్ నగరంలో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా నేతృత్వంలో జరుగుతున్న అంతర్జాతీయ అణుభద్రత సమావేశంలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోడి సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “అణు ఉగ్రవాదం గురించి మాట్లాడేముందు మనం దాని నివారణ, విచారణ గురించి చాలా స్పష్టంగా మాట్లాడుకోవలసి ఉంటుంది. అప్పుడే మనం ఆశించిన ఫలితాలు కనబడుతాయి. ప్రస్తుతం ఉగ్రవాదం తీరు తెన్నులు కూడా చాలా మారాయి. మనం ముఖ్యంగా మూడు విషయాలు గుర్తుంచుకోవాలి. 1. ఉగ్రవాదులు చాలా కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. 2. వాళ్ళు ఇదివరకులాగ ఎక్కడో గుహలలో దాక్కోవడం లేదు. వాళ్ళు మనమధ్యనే తిరుగుతూ సెల్ ఫోన్స్, ల్యాప్ టాప్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ విద్వంసం సృష్టిస్తున్నారు. కానీ వాళ్ళని కనిపెట్టి పట్టుకొనేందుకు మనం మాత్రం ఇంకా పాతకాలం నాటి పద్ధతులనే పాటిస్తున్నాము. 3. వివిధ దేశాలలో ఉగ్రవాదులకు, అణుధార్మిక పదార్ధాలను అక్రమంగా సరఫరా చేసేవారికి కొందరు వ్యక్తులు రహస్యంగా అందిస్తున్న సహాయసహకారాలు చాలా ప్రమాదకరంగా మారాయి. దానిని మనం అడ్డుకోవలసి ఉంటుంది,” అని చెప్పారు.

“ఉగ్రవాదులలో మీ ఉగ్రవాదులు, మా ఉగ్రవాదులని వేరేగా ఉండరు. ఉగ్రవాదులు ఎవరయినా ఒక్కటే. ఉగ్రవాదం అందరికీ సంబంధించిన సమస్య. వాళ్ళ ఉగ్రవాదులతో మాకు హాని ఉండబోదని అనుకోవడం సరికాదు. మొన్న బ్రసెల్స్ నగరంలో ఏమయిందో అందరూ చూసారు. కనుక అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా సూచిస్తున్న విధంగా ప్రపంచంలో అన్ని దేశాలు కలిసి ఉగ్రవాదంపై పోరును కొనసాగించాల్సి ఉంటుంది. అప్పుడే దానికి అడ్డుకోగలము,” అని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close