బాహుబ‌లి 2… ఓ స‌రికొత్త‌ రూమ‌ర్‌

బాహుబ‌లిపై పుట్టుకొచ్చిన రూమ‌ర్ల‌కు లెక్కలేదు. ప్రతీరోజూ బాహుబ‌లికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన అంశం.. మీడియాకు ఎక్కేది. దాని గురించి రాజ‌మౌళి కూడా స్పందించాల్సివ‌చ్చేది. ‘అదేం లేదు..’ అని రాజ‌మౌళి క్లారిటీ ఇచ్చేంత వ‌ర‌కూ అదే టాపిక్ మీడియాలో.. హాట్ హాట్‌గా తిరిగేది. కొన్నాళ్లకు రాజ‌మౌళి అండ్ టీమ్ కూడా ఇలాంటి గాసిప్పుల్ని ప‌ట్టించుకోవ‌డం మానేసింది. బాహుబ‌లి 2 విష‌యంలోనూ ఆ గాసిప్పుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది.

బాహుబ‌లి 2 కి సంబంధించిన లేటెస్ట్ గాసిప్ ఏంటంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా ప‌దుకొణె న‌టిస్తోంద‌ట‌. బాహుబ‌లి పార్ట్ 1 హిందీలో అద్భుత‌మైన విజ‌యం సాధించింది. అక్క‌డ వంద కోట్లు వ‌సూలు చేసిన తొలి ద‌క్షిణాది చిత్రంగా నిలిచింది. బాహుబ‌లి 2 గురించి బాలీవుడ్ కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ఆక్క‌డి ఆడియన్స్ దృష్టిని మ‌రింత‌గా ఫోక‌స్ చేయించాలంటే బాలీవుడ్ తారల్ని బాహుబ‌లి 2లోకి తీసుకురావ‌ల్సిందే అని రాజ‌మౌళి భావిస్తున్నార‌ని, అందుకే దీపిక‌ని సంప్ర‌దించార‌ని, బాహుబ‌లి అన‌గానే మ‌రో మాట‌కు తావు లేకుండా దీపికా ఒప్పేసుకొంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి వీటిపై రాజ‌మౌళి అండ్ టీమ్ స్పందిస్తుందా, లేదా?? ఇది కూడా గాసిప్పేనా, ఇందులో నిజాలేమైనా ఉన్నాయా?? అనే క్లారిటీ రావాలంటే ఇంకొన్నిరోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close