జె&కెలో భాజపా అధికారంలోకి వస్తే తెలంగాణాలో కూడా వచ్చేస్తుందా?

భాజపా ఆవిర్భావోత్సం సందర్భంగా ఆ పార్టీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ నేతలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మన పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవరూ ఊహించలేదు కానీ, ప్రధాని నరేంద్ర మోడి కారణంగా మన పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. అలాగే వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో కూడా మనమే అధికారంలోకి వస్తాము. పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల తరువాత తెలంగాణా రాష్ట్రంలో భాజపా జెండా ఎగురవేయాలి. కాంగ్రెస్ పార్టీ ఒకపక్క దేశద్రోహులతో, సంఘ విద్రోహశక్తులతో చేతులు కలిపి సాగుతూ, జాతీయవాదం, దేశభక్తి గురించి మాట్లాడుతునందుకు మనపై పనిగట్టుకొని చాలా దుష్ప్రచారం చేస్తోంది,” అని అన్నారు.

కిషన్ రెడ్డి దేశభక్తి, దేశద్రోహుల గురించి మాట్లాడుతున్నప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం గురించి మాట్లాడటం చాలా పొరపాటు. ఎందుకంటే అక్కడ దేశం నుంచి విడిపోవాలని కోరుకొంటున్న కాశ్మీర్ వేర్పాటువాదులకు మద్దతునిస్తున్న పీపుల్స్ డెమొక్రేటిక్ పార్టీతో భాజపా అంటకాగుతూ, అది ఏర్పాటు చేసిన సంకీర్ణప్రభుత్వంలో భాగస్వామిగా కూడా ఉంది. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ప్రమాణస్వీకారం చేసినవెంటనే పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఉగ్రవాదులు, వేర్పాటువాదులకి బహిరంగంగానే కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన కుమార్తె మహాబూబా ముఫ్తీ కూడా తండ్రి అడుగు జాడలలోనే నడుస్తానని బహిరంగంగానే చెప్పుకొంటున్నారు. ఆమెకే భాజపా మద్దతు ఇస్తోందిపుడు. మరి అటువంటి వేర్పాటువాదులతో భాజపా అంటకాగుతూ దేశభక్తి, జాతీయవాదంపై తమకే పేటెంట్ హక్కులున్నట్లు, దేశంలో మరెవరికీ దేశభక్తి లేదన్నట్లు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఊహించని విధంగా భాజపా అధికారంలోకి వచ్చింది కనుక తెలంగాణాలో కూడా వచ్చేస్తుందని కిషన్ రెడ్డి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 2014ఎన్నికల తరువాత నుంచి నిన్న మొన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలవరకు ఏ ఒక్క ఎన్నికలలో కూడా గెలవలలేక చతికిల పడిన భాజపా వచ్చే ఎన్నికలలో ఏవిధంగా గెలవగలదో, ఏవిధంగా అధికారంలోకి రాగలదో కిషన్ రెడ్డి కాస్త వివరించి ఉండి ఉంటే బాగుండేది. ‘తెలంగాణాలో కేవలం హైదరాబాద్ లో మాత్రమే భాజపా కాస్త బలంగా ఉంది మరెక్కడా దాని ఉనికే కనబడటం లేదని’ భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారంటే తెలంగాణాలో భాజపా పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చును. కనీసం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలోనయినా అది విజయం సాధించి తన సత్తా చాటుకొని ఉండి ఉంటే, కిషన్ రెడ్డి మాటలు కొంచెమయినా నమ్మశక్యంగా ఉండేవి. కానీ తెలంగాణాలో పార్టీ బలోపేతానికి ఎటువంటి కృషి చేయకుండా, తెరాస ధాటిని తట్టుకోలేక చేతులెత్తేస్తూ వచ్చే ఎన్నికలలో తెలంగాణా భాజపా జెండా రెపరెపలాడుతుందని చెపుతుంటే ఎవరయినా నవ్వకుండా ఉండలేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close