ఆ తర్వాత తెదేపాలో చేరిన వారందరూ పులిహోరలో కరివేపాకులేనా?

ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అవ్వబోయే 4 రాజ్యసభ సీట్లలో ఒకటి వైకాపాకి దక్కుతుంది కానీ ఆ ఒక్కటి కూడా దానికి దక్కకుండా చేస్తామని తెదేపా ముందే ప్రకటించేసి వైకాపాపై యుద్దానికి బయలుదేరింది. కనుక ఈ విషయంలో తెదేపాకి చాలా క్లారిటీ ఉందని స్పష్టం అయిపోయింది. పార్టీ నుంచి 11మంది ఎమ్మెల్యేలు బయటకి వెళ్ళిపోయాక జగన్మోహన్ రెడ్డికి కూడా దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చినట్లుంది. అందుకే ఆయన పార్టీ మారబోతున్నారని అనుమానం వచ్చిన గొట్టిపాటి రవి, మేకా ప్రతాప్ అప్పారావులను పిలిపించుకొని చంద్రబాబు నాయుడు పులిహోర-కరివేపాకు తత్వం గురించి క్లాస్ పీకారు.

తమ పార్టీకి దక్కాల్సిన నాల్గవ రాజ్యసభ సీటుని కూడా తమ ఖాతాలో వేసుకోనేందుకే చంద్రబాబు నాయుడు వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలోకి పిలుస్తున్నారు తప్ప మీ మీద ప్రేమతో కాదని జగన్మోహన్ రెడ్డి వారికి నచ్చజెప్పారు. కనుక రాజ్యసభ ఎన్నికలు పూర్తికాగానే తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలందరినీ ఆయన పులిహోరలో కరివేపాకులాగ తీసి పక్కన పడేస్తారని జగన్ తన ఎమ్మెల్యేలను హెచ్చరించారు. వైకాపా ఎమ్మెల్యేల సహాయంతో వైకాపానే ఓడించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుంటే, ఆ సంగతి గ్రహించి కూడా మీరు తెదేపాలోకి వెళ్ళడం సమంజసమా? అని జగన్ వారిని ప్రశ్నించారు. ఆ ఒక్క రాజ్యసభ సీటు మనం దక్కించుకోలేకపోతే రాష్ట్రంలో పార్టీ బలహీనపడిపోయిందని తెదేపా ప్రచారం మొదలుపెట్టి మనల్ని ఇంకా బలహీనపరిచే ప్రయత్నం చేస్తుంది కనుక తెదేపా ప్రలోభాలకు లొంగకుండా నిలబడాలని జగన్ కోరారు. పార్టీలోనే కొనసాగినట్లయితే మీకు మున్ముందు చాలా మేలు కలుగుతుంది అందుకు నేను హామీ ఇస్తున్నానని జగన్మోహన్ రెడ్డి వారికి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.

రాజ్యసభ ఎన్నికలయ్యేవరకే తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తారని జగన్ వెలిబుచ్చిన అభిప్రాయం నూటికి నూరు శాతం నిజం కావచ్చును. భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ వంటి సీనియర్లకి తప్ప మిగిలిన వారిని పెద్దగా పట్టించుకోకపోవచ్చును. పట్టించుకొనేమాటయితే తెదేపాలోనే ఏ గుర్తింపుకి నోచుకోని అనేకమంది ఎమ్మెల్యేలు ఎందుకున్నారు?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close