చంద్రబాబు మంత్రం కేసీఆర్‌కు అంత నచ్చిందా?

ప్రభుత్వాలు ప్రజల్ని ఇన్‌స్టంట్‌గా ఆకర్షించడానికి వేలవేల కోట్ల రూపాయల సంక్షేమ లేదా ఆకర్షణీయ ప్రాజెక్టులను ప్రకటిస్తాయి. కానీ ఆ సొమ్ము మొత్తం ఎక్కడినుంచి తేవాలి? ప్రజలనుంచి ప్రభుత్వాలకు ఆదాయం రూపంలో సమకూరే మొత్తం ఒక స్థాయి వరకే ఉంటుంది. ఈ అదనపు వరాలకు అయ్యే వేల కోట్లు ప్రభుత్వాలకు ఎప్పుడూ భారంగానే ఉంటాయి. అయితే అలాంటి ఆర్థిక వనరులను సమీకరించుకోవడానికి..చంద్రబాబునాయుడు పఠించిన మంత్రం ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా తెగ నచ్చినట్లుగా కనిపిస్తోంది.

అమరావతి రాజధాని నిర్మాణానికి చేతిలో పైసా లేకపోయినా సరే.. పనులు పూర్తిచేయడానికి ల్యాండ్‌పూలింగ్‌ అనే విధానాన్ని చంద్రబాబు అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాదులో తాను ప్రకటించిన కొన్ని అత్యద్భుత ప్రాజెక్టులను కార్యరూపంలోకి తేవడానికి ప్రస్తుతం కేసీఆర్‌ కూడా ఇదే బాట పట్టబోతున్నారు. హైదరాబాదులో నగర వాసుల జీవనాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దడంతో పాటు, నగరంలో తనదైన ముద్ర కనిపించేలా, హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దే కృషిలో భాగంగా.. మూసీ నది మీద ఆకాశమార్గాలు నిర్మించాలని, మూసీ పరీవాహక ప్రాంతం మొత్తం సుందరీకరణ పనులు చేపట్టాలని కేసీఆర్‌ సర్కారు నిర్ణయించింది. ఈ పనులు మొత్తానికి సుమారు 20 వేల కోట్లు అవసరం కావొచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత డబ్బు ఎక్కడినుంచి తేవాలి? అనేది ప్రభుత్వం ముందున్న ప్రశ్న.

మూసీ తీరంలోని భూములను ల్యాండ్‌పూలింగ్‌ ద్వారా సేకరించి.. వాటిని లే అవుట్‌లు వేసి విక్రయించడం ద్వారా ఈ బృహత్‌ ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు మొత్తం సమకూరుతాయని సర్కారు భావిస్తోంది. దీనికి సంబంధించి మూసీ తీరంలో ప్రభుత్వ, ప్రెవేటు భూములు ఏమేరకు ఉన్నాయో లెక్కతేల్చే పనిలో అధికారులు ఉన్నారు. మొత్తానికి చేతిలో సొమ్ము లేకుండా అభివృద్ధి పనులు చేపట్టడానికి చంద్రబాబు ప్లాన్‌ ల్యాండ్‌పూలింగ్‌ ఒక్కటే మార్గమని కేసీఆర్‌ కూడా నమ్ముతున్నట్లుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

ఓటేస్తున్నారా ? : ఒక్క సారి మద్యం దుకాణాల వైపు చూడండి !

అనగనగరా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ పాలకుడు. అక్కడ అతను చెప్పిందే కొనాలి. అతను చెప్పిందే తాగాలి . అంతా అతని దుకాణాలే ఉంటాయి. ఆ దుకాణాల్లో అమ్మేవి తాగి చచ్చిపోతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close