బాలీవుడ్‌కి వెళ్తున్న రాజ‌న్న‌

నాగార్జున – విజ‌యేంద్ర ప్రసాద్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం రాజ‌న్న‌. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఆశించినంత విజ‌యాన్ని అందుకోలేదు. కాక‌పోతే నైజాంలో ర‌జాకారుల‌పై ఉద్య‌మ నేప‌థ్యంలో తీసిన కొన్ని స‌న్నివేశాలు బాగా న‌చ్చాయి. దానికి తోడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఈ సినిమాలో కొన్ని యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ని తెర‌కెక్కించాడు. దాంతో రాజ‌న్న ప్ర‌త్యేక‌త సంత‌రించుకొంది. ఇప్పుడీ చిత్రాన్ని బాలీవుడ్‌లో తీసుకెళ్తున్నారు. స‌న్నీడియోల్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్నాడు. విజయేంద్ర ప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు.

భ‌జ‌రంగీ భాయ్ జాన్ చిత్రానికి క‌థ అందించి, బాలీవుడ్‌లోనూ పాపుల‌ర్ అయ్యాడు విజ‌యేంద్ర ప్ర‌సాద్‌. ఆ సినిమానే.. బాలీవుడ్‌లో మెగా ఫోన్ ప‌ట్టేంత ఉత్సాహం ఇచ్చింది. రాజ‌న్న సినిమాలో కొన్ని మార్పులు చేసి బాలీవుడ్‌లో తీస్తార‌ట‌. ఈ సినిమాకి భార‌త్ మాతాకీ జై అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. మ‌రో విశేషం ఏంటంటే ఈ చిత్రానికి రాజ‌మౌళి క్రియేటీవ్ హెడ్‌గా ప‌నిచేస్తాడ‌ట‌. బాహుబ‌లితో రాజ‌మౌళి ఖ్యాతి బాలీవుడ్‌కీ తాకింది. జ‌క్క‌న్న క్రియేటీవ్ హెడ్ అంటే,.. ఈ సినిమాకి క్రేజ్ అమాంతం పెరిగిపోవ‌డం ఖాయం. మ‌రి ఇక్క‌డ ఫ్లాప్ అయిన సినిమా బాలీవుడ్లో మాత్రం హిట్ట‌వుతుంద‌న్న గ్యారెంటీ ఏమిటో అర్థం కాదు. ద‌ర్శ‌కుడిగా విజ‌యేంద్రుడు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా స‌క్సెస్ కాలేదు. మ‌రి ఈసారి బాలీవుడ్‌లో అయినా.. త‌న స‌త్తా చూపిస్తాడంటారా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ : రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలిసుల నోటిసులు..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close