చౌద‌రిగారు… మ‌ళ్లీ రంగంలోకి దిగుతున్నారు

వైవిఎస్ చౌద‌రిది విభిన్న‌మైన స్టైల్‌. ప‌రాజ‌యాల్ని లెక్క చేయ‌డు. తాను న‌మ్మిన దారిలోనే వెళ్తాడు. సినిమా చిన్న‌దా, పెద్ద‌దా చూడ‌డు. స్టార్‌కి మార్కెట్ ఉందా, లేదా… లెక్క‌వేయ‌డు. త‌న సినిమా అనుకొన్న‌ట్టు రావ‌డానికి ఎన్ని కోట్ల‌యినా ఖ‌ర్చుపెడతాడు. రేయ్ కోసం కూడా అలానే కోట్లు కుమ్మ‌రించాడు. కానీ ఫ‌లితం రాలేదు. పైగా స‌గానికి స‌గం న‌ష్ట‌పోయాడు. ఈసినిమాతో ఆస్తులల‌న్నీ అమ్ముకోవాల్సివ‌చ్చింద‌ని చౌద‌రిపై టాక్ కూడా వినిపించింది. అందుకే ఏయ్ త‌ర‌వాత కొంత‌కాలం వైవిఎస్ చౌద‌రి నుంచి ఎలాంటి అలికిడీ లేదు. ఇప్పుడు మ‌ళ్లీ ఓ స్ర్కిప్టు ప‌ట్టుకొని సినిమా చేయ‌డానికి రెడీ అయిపోయాడ‌ని టాక్‌.

ప్రేమ‌, కుటుంబ బంధాల‌తో క‌థ‌లు అల్లుకోవ‌డం వైవిఎస్ శైలి. అయితే ఈసారి త‌న అభిరుచికి భిన్నంగా, ప్ర‌స్తుత ట్రెండ్‌కి అనుగుణంగా ఓ ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ స్టోరీ రాసుకొన్నాడ‌ట‌. ఓ అగ్ర హీరోతో ఆ సినిమా చేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. వైవిఎస్ ట్రాక్ రికార్డు చూస్తే అగ్ర క‌థానాయ‌కులెవ్వ‌రూ సుల‌భంగా ఛాన్సులివ్వ‌రు. కానీ వాళ్ల‌కు మెప్పించ‌డంలో వైవిఎస్ ఘ‌టికుడే. ఏదో ఓ మాయ చేసి.. టాప్ హీరో డేట్లు ప‌ట్టేయ‌డం ఖాయంలా క‌నిపిస్తోంది. మ‌రి వైవిఎస్ క‌థ‌కు బౌల్డ్ అయ్యే ఆ హీరో ఎవ‌రో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close