తెరాస ప్లీనరీకి ఖమ్మంని ఎంచుకోవడం యాదృచ్చికమేనా?

ప్రతీ ఏటా తెరాస ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకొంటుంది. ఒక్క తెరాసయే కాదు అన్ని రాజకీయ పార్టీలు కూడా నిర్వహించుకొంటాయి. ఈ నెల 27న ఖమ్మంలో తెరాస ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకొని అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొంటోంది. ఈలోగా అదే జిల్లాలో పాలేరు శాసనసభ నియోజక వర్గానికి ఉపఎన్నికలు వచ్చి పడ్డాయి. ఎన్నికల సంఘం వాటి షెడ్యూల్ కూడా విడుదల చేసింది కనుక జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. కోడ్ కారణంగా ఖమ్మంలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోవడానికి అవరోధం ఏర్పడింది.

ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుమతించాలంటూ మంత్రి కె.టి.ఆర్. ఎన్నికల సంఘానికి ఒక లేఖ వ్రాసారు. దానిలో తమ పార్టీ ప్రతీ ఏటా ఆనవాయితీగా ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకొంటోందని, ఈసారి వాటిని ఖమ్మంలో నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి కనుక వేరే చోట నిర్వహించడం చాలా కష్టమవుతుందని, కనుక ఖమ్మంలోనే పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుమతించాలని కోరారు. దానిపై ఎన్నికల సంఘం ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఎన్నికల సంఘం నిర్ణయం కోసం వేచి చూడకుండా ప్లీనరీ సమావేశాల కోసం తెరాస చకచకా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొంటోంది.

ఒకవేళ ఎన్నికల సంఘం అందుకు అంగీకరించకపోతే ఏమి చేస్తుందో అది వేరే సంగతి కానీ ఖమ్మం జిల్లాలోనే ప్లీనరీ సమావేశాలు పెట్టుకోవాలని తెరాస నిర్ణయం ఏదో యాదృచ్చికంగా తీసుకొన్నది కాదని అర్ధమవుతోంది. దేశంలో నాలుగు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతమ (పుదుచ్చేరి) శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి చాలా రోజులే అయ్యింది. ఎన్నికల కమీషన్ సాధారణంగా అటువంటి వాటితో కలిపే దేశంలో ఉపఎన్నికలు కూడా నిర్వహిస్తుంటుందని అందరికీ తెలుసు. కనుక పాలేరు ఉపఎన్నికలు కూడా అప్పుడే జరుగవచ్చని తెరాస ముందే పసిగట్టి, పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోవడానికి ఖమ్మంని ఎంచుకొని ఉండవచ్చు. సరిగ్గా ఉపఎన్నికలు జరిగే సమయంలో ఖమ్మంలో అట్టహాసంగా పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోవడం ద్వారా ఆ ప్రభావం పాలేరు ఓటర్లపై కూడా పడుతుంది. ఆ సమావేశంలో కేసీఆర్, కె.టి.ఆర్. తదితర నేతల ప్రసంగాలలో హామీలు, తాము రాష్ట్రాన్ని, ప్రత్యేకించి ఖమ్మం జిల్లాని ఏవిధంగా అభివృద్ధి చేయబోతున్నామో చెపుతూ వారు చూపించే అందమయిన రంగుల కలలు పాలేరు ఓటర్లపై ప్రభావం చూపడం ఖాయం. ఆ నియోజకవర్గంలో ఎలాగూ తెరాస ఉదృతంగా ప్రచారం చేస్తుంది. దానికి ప్లీనరీ ప్రసంగాలు, అట్టహాసం కూడా తోడయితే ఉపఎన్నికలలో అవలీలగా విజయం సాధించవచ్చని తెరాస అధినేత ఉద్దేశ్యం కావచ్చు. అందుకే ఆయన ప్లీనరీ సమావేశాల కోసం ఈసారి ఖమ్మం ని ఎంచుకొని ఉండవచ్చు. చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలనుకొనే కేసీఆర్ ఈ ఉపఎన్నికలలో తమ పార్టీయే అవలీలగా గెలుస్తుందని తెలిసి ఉన్నప్పటికీ ఎలాగూ ఈ అవకాశం కలిసివచ్చింది కనుక అదనంగా ఈ జాగ్రత్త కూడా తీసుకొన్నారేమో? అని అనుమానించవలసి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close