డ్రాగన్ చైనాకు షాకిచ్చిన భారత్

టిట్ ఫర్ టాట్. డ్రాగన్ చైనాకు కీలెరిగి వాత పెట్టింది మోడీ ప్రభుత్వం. చైనా ఉగ్రవాదిగా ముద్ర వేసిన ప్రపంచ యుగర్ కాంగ్రెస్ నాయకుడు దోల్కిన్ ఇసాకు భారత్ వీసా మంజూరు చేసింది. దీంతో చైనా పాలకుకు దిమ్మతిరిగింది. ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ఉన్న వ్యక్తికి భారత్ వీసా ఇవ్వడం దారుణమని చైనా ఇప్పుడు నెత్తీ నోరూ బాదుకుంటోంది.

భారత్ లో ముస్లింలున్నట్టే, చైనాలో తుర్కిక్ ముస్లిం మూలాలున్న యుగర్లున్నారు. ముఖ్యంగా జిన్ జియాంగ్ రాష్ట్రంలో దాదాపు కోటి మంది యుగర్లు నివసిస్తున్నారు చైనా కమ్యూనిస్టు పాలకుల అరాచకాలపై తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్లను అణచివేయడానికి చైనా నిరంకుశ పాలకులు చేయాల్సిందంతా చేస్తున్నారు. యుగర్ల తరఫున పోరాడటానికి ఏర్పడిన సంస్థే ప్రపంచ యుగర్ కాంగ్రెస్. దాని నాయకుడు దోల్కిన్ ఇసా జర్మనీలో ఆశ్రయం పొందాడు.

ఈనెలాఖరులో హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో టిటెట్ మతగురువు దలైలామాను కలవడానికి కూడా ఇసాకు భారత్ అనుమతినిచ్చింది. అలాగే, ప్రజాస్వామ్యం-చైనా అనే అంశంపై ధర్మశాలలో జరిగే సదస్సులో కూడా అతడు పాల్గొంటాడు. దీనికి కూడా భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో చైనా పాలకులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. తాము టెర్రరిస్టుగా ముద్రవేసిన వ్యక్తికి భారత్ వీసా ఇవ్వడానికి జీర్ణించుకోలేకపోతున్నారు.

చైనా మాత్రం పాకిస్తాన్ పెంచి పోషించే ఉగ్రవాదులకు కొమ్ము కాస్తూనే ఉంటుంది. పఠాన్ కోట్ ఉగ్రదాడికి స్కెచ్ వేసిన నరరూప రాక్షసుడు పాకిస్తాన్ లో ఆశ్రయం పొందిన మసూద్ అజర్ పై అంతర్జాతీయంగా ఆంక్షలు విధించడానికి భారత్ విధించింది. అతడిపై ఐక్య రాజ్య సమితి ఆంక్షలు ప్రకటించే సమయంలో చైనా అడ్డుకుంది. వీటో చేసింది. భారత్ ప్రయత్నానికి విఘాతం కలిగించింది. తన మిత్ర దేశం పాకిస్తాన్ ఆశ్రయమిచ్చిన టెర్రరిస్టును కాపాడటానికి, పాక్ పరువు నిలపడానికి చైనా ఆరాటపడింది. భారత్ అభ్యంతరాలను పట్టించుకోలేదు.

దీనికి టిట్ ఫర్ టాట్ అన్నట్టు భారత్ గట్టి కౌంటరిచ్చింది. ఏ పేరు వింటే చైనా పాలకులు ఆగ్రహంతో ఊగిపోతారో, ఏ సంస్థను ఈసడించుకుంటారో ఆ సంస్థ నాయకుడికి భారత్ వీసా మంజూరు చేసింది. అంతర్జాతీయ వ్యవహారాల్లో ధర్మాన్ని పాటించకపోతే ఇలాంటి షాకులు తప్పవని చైనాకు గుర్తు చేసినట్టయింది. తాను ఆడింది ఆటగా భావించే డ్రాగన్ పాలకులకు కుక్క కాటుకు చెప్పుదెబ్బ లాంటి షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.

ఈ దెబ్బతో అయినా చైనా నిరంకుశ పాలకులకు కనువిప్పు కలుగుతుందేమో చూడాలి. జీహాదీ ఉగ్రవాదం దెబ్బ భారత్ కే కాదు, చైనాకు కూడా అనుభవంలోకి వస్తోంది. యుగర్ యువకులు కొందరు ఉగ్రవాదులుగా మారారని చైనా గుర్తించింది. వాళ్లలో కొందరిని మట్టుబెట్టిందనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, తమ దేశంలో తలదాచుకుంటున్న యుగర్ టెర్రరిస్టులను పాకిస్తాన్ అంతం చేసిందని, చైనా మెప్పుకోసం ఈ పని చేసిందని కూడా వార్తలు వచ్చాయి. మొత్తానికి యుగర్ల ద్వారా ముప్పు పొంచి ఉందని చైనా భయం. కాబట్టి ఇకముందైనా భారత్ అభిప్రయాన్ని గుర్తెరిగి ప్రవర్తిస్తుందేమో చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close