తెదేపా-బీజేపీలు ప్రజలతో గేమ్స్ ఆడుకొంటున్నాయా?

లోక్ సభలో నిన్న ఒక సభ్యుడు ప్రత్యేకహోదాపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి ఆర్.ఇంద్రజిత్ సింగ్ ఇచ్చిన సమాధానం తెదేపా, బీజేపీలను ఇరకాటంలో పడేసింది. “ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో లేవు. ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదు కూడా. అటువంటి విధానం ఏదీ లేదు,” అని జవాబిచ్చారు.

కానీ సరిగ్గా నెలరోజుల క్రితమే కేంద్రమంత్రి సుజానా చౌదరి మీడియాతో మాట్లాడుతూ “ప్రత్యేకహోదాకి సంబంధించి 60 శాతం పనులు పూర్తయిపోయాయి. మరికొన్ని రోజుల్లో మిగిలిన పనులు కూడా పూర్తవగానే కేంద్రప్రభుత్వం దీనిపై ప్రకటన చేయబోతోంది,” అని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం అయితే ఇదే ఆ ప్రకటన అని భావించాల్సి ఉంటుంది. కానీ “ప్రత్యేకహోదాకి సంబంధించి 60 శాతం పనులు పూర్తయిపోయాయని చెప్పినప్పుడు, ఇంద్రజిత్ సింగ్ ఇటువంటి ప్రకటన చేయడమేమిటి?” అని ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా తెదేపా, బీజేపీలను నిలదీస్తారు.

ప్రత్యేకహోదాపై సుజానా చౌదరి చెప్పిన మాటలు నిజమనుకొంటే, త్వరలోనే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సి ఉంటుంది. అదే నిజమనుకొంటే ఇంద్రజిత్ సింగ్ లోక్ సభ సభ్యులను త్రప్పు ద్రోవ పట్టిస్తున్నారనుకోవలసి ఉంటుంది. అలా కాక ఇంద్రజిత్ సింగ్ చెప్పినదే వాస్తవమనుకొంటే సుజానా చౌదరి, తెదేపా, బీజేపీలు ఉద్దేశ్యపూర్వకంగానే రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది.

ఏమయినప్పటికీ ఇంద్రజిత్ సింగ్ చెప్పిన ఆ జవాబు రాష్ట్రంలో ప్రతిపక్షాలకు గొప్ప ఆయుధంగా అందివచ్చింది. తెదేపా, బీజేపీలు రెండూ కలిసి ‘ప్రత్యేకహోదా’ అంశంపై ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తున్నాయని వైకాపా సీనియర్ నేత కె.పార్ధసారధి విమర్శించారు. ప్రత్యేకహోదా ఇవ్వలేకపోయినా తెదేపా కేంద్రంలో భాగస్వామిగా ఇంకా ఎందుకు కొనసాగుతోందని ప్రశ్నించారు.

కాంగ్రెస్, వామపక్షాలు, ప్రత్యేకహోదా, ఇతర హామీల అమలు కోసం నటుడు శివాజీ అధ్యక్షతన ఏర్పడిన సాధనసమితి అందరూ కలిసి తెదేపా, బీజేపీలను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ ప్రత్యేకహోదా కోసం పోరాటాలు మొదలుపెట్టడం తధ్యం. పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ రెండు ట్వీటులు తగిలించి మరింత వేడి పుట్టించవచ్చును. అప్పుడు మళ్ళీ షరా మామూలుగానే రాష్ట్రంలో తెదేపా-బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం జరగవచ్చును. కానీ ఏమి చేసినా ప్రత్యేకహోదా వస్తుందా రాదా? అనే సంగతి ఒక్క మోడీకి తప్ప మరెవరికీ తెలియదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close