తెరాసకు సీమాంధ్రులే ఆధారం!!

ఆశ్చర్యపోతున్నారా? సీమాంధ్ర ఓట్లు తనకే అని తెరాస సంబరపడుతోందని భావిస్తున్నారా? విషయం అది కాదు. ఇది ఆధార్ కు సంబంధించిన విషయం. ఓటర్లు ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలని, లేకపోతే ఓటు హక్కు ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ విషయంలోనూ ఆధారం తప్పనిసరి అనే నిర్బంధం చెల్లదని సుప్రీం కోర్టు ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేసింది. అయితే బోగస్ ఓటర్ల ఏరివేతకు ఆధారే అత్యుత్తమ మార్గమని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.

దేశ వ్యాప్తంగా ఇదే పని చేస్తోంది. హైదరాబాదులో పెద్ద సంఖ్యలో ఉన్న సీమాంధ్రులు చాలా మందికి ఇక్కడ ఓటున్నా, సొంత ఊరిలోనే ఆధార్ కార్డు ఉంది. కాబట్టి వీరు హైదరాబాదులో ఆధార్ అనుసంధానం చేసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించక తప్పదని తెరాస నేతలు చెప్తున్నారు, ఇలా కొన్ని లక్షల మంది సీమాంధ్ర ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిస్తే, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కారు విజయావకాశాలు పెరుగుతాయని గులాబీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. తెలంగాణ జిల్లాల్లో ఈ అనుసంధానం జోరుగా జరుగుతుంటే హైదరాబాదులో మాత్రం మందకొడిగా సాగుతోంది.

అందుకే, త్వరగా చేయించకపోతే ఓటు పోతుందని కేసీఆర్ చెప్పారు. అయితే సుప్రీం కోర్టు ఉత్తర్వులను భిన్నంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయడమే ఆశ్చర్యకరం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బ్రహ్మ కూడా ఆధార్ తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేస్తామని చెప్పలేదు. చేస్తే అది సుప్రీం కోర్టులో చెల్లదని ఆయనకు తెలుసు. అందుకే, ప్రజలే స్వచ్ఛందంగా అనుసంధానం చేయించుకుంటున్నారని, తాము మాత్రం అలాంటి ఆదేశాలు జారీ చేయాలని భావించడం లేదని ఈ మధ్య చెప్పారు. తెరాస శ్రేణులు మాత్రం ఆధార్ అనుసందానం ఆధారంగా సీమాంధ్ర ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తే మంచిదని కోరుకుంటున్నాయి. ఇప్పటికే తొలగింపు ప్రక్రియ మొదలైందని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే, ఎవరైనా సీమాంధ్రులు దీన్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్తే ఏమవుతుందో చూడాలి. అయితే, పార్టీ బలాన్ని పెంచుకోకుండా ఇతర పార్టీల వారిని ఆకర్షించడానికి ప్రయత్నించడం, ఆధార్ ను నమ్ముకోవడం ఏమిటని కొందరు పరిశీలకులు ఆశ్చర్యం వ్చక్తం చేస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తూ, ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేసే వారిని జెండా మోయడానికే పరిమితం చేస్తున్నారనే టాక్ కూడా ఉంది.

గ్రేటర్ ఎన్నికలు జరిగే లోగా ఇంకెంత మంది ఇతర పార్టీల వారిని ఆకర్షిస్తారో్. వారికి ఎలాంటి పదవులు కట్టబెడతారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close