ఏపి కాంగ్రెస్ కూడా టి-ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉద్యమం

తెలంగాణాలో నిర్మిస్తున్న పాలమూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులని వ్యతిరేకిస్తూ మొదట ఏపి కాంగ్రెస్ పార్టీయే ఉద్యమం మొదలుపెట్టింది. ఆ తరువాత దానిని జగన్మోహన్ రెడ్డి అందిపుచ్చుకొని కర్నూలులో మూడు రోజులు నిరాహార దీక్ష చేసారు. ఆయన పోరాటం ముగించిన తరువాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దానిని అందిపుచ్చుకొని ఉద్యమించడానికి సిద్ధం అవుతోంది.

ఈనెల 23న ప్రకాశం బ్యారేజిపై ధర్నాలు చేస్తామని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చెప్పారు. తెలంగాణాలో నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుల వలన దిగువనున్న ఆంధ్రప్రదేశ్ లో సుమారు 50 లక్షల ఎకరాలు బీడు భూములుగా మారే ప్రమాదం ఉందని అన్నారు. వాటి వలన 8 జిల్లాలలో ప్రజలకు త్రాగడానికి నీళ్ళులేని పరిస్థితి ఏర్పడవచ్చని అన్నారు. అయినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకి నోటు కేసుకి భయపడి కేసీఆర్ ని గట్టిగా నిలదీయడం లేదని విమర్శించారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటుకి నోటు కేసుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విమర్శించారు.

ఆ ప్రాజెక్టులని అడ్డుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ జగన్ కర్నూలులో మూడు రోజులు దీక్షలు చేసినపుడు ఆయనతో సహా వైకాపా నేతలు అందరూ వాటి వలన రాష్ట్రానికి జరిగే నష్టం కంటే వాటిని అడ్డుకోలేని చంద్రబాబు బలహీనత గురించి చాలా గట్టిగానే మాట్లాడారు. ఆ తరువాత వైకాపా నేతలెవరూ మళ్ళీ ఆ ప్రాజెక్టుల గురించి మాట్లడటం లేదు. వాటిని వ్యతిరేకిస్తూ జగన్ మళ్ళీ తన ఉద్యమం కొనసాగిస్తారో లేదో తెలియదు. ఇప్పుడు రఘువీరా రెడ్డి వాటి గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయన ఎన్ని రోజులు పోరాడుతారో కూడా తెలియదు. ఈ విధంగా చిత్తశుద్ధి లేని పోరాటాలు చేయడం వలనే ప్రజలు కూడా వారిని విశ్వసించలేకపోతున్నారు. ఆ ప్రాజెక్టుల వలన రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు వాటిపై రాజకీయాలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తున్నాయి. అందుకే తెరాస నేతలు కూడా వారి చిత్తశుద్ధిని శంఖిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నార్త్ కు మోడీ ప్రాధాన్యత…దక్షిణాదిలో బీజేపీకి ఓట్లు రాలేనా..?

మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తోందని, దక్షిణాది రాష్ట్రాలను విస్మరిస్తోందని విమర్శలున్నాయి. బడ్జెట్ కేటాయింపులు , కేంద్ర మంత్రివర్గ శాఖలు.. ఇలా ఎలా చూసినా నార్త్...

ఓటేస్తున్నారా ? : బోడిగుండుగా మారిన రుషికొండను గుర్తు చేసుకోండి !

చంద్రబాబు హయాంలో ఐదు వందల కోట్లు పెట్టి సచివాలయ భవనాలు, అసెంబ్లీని నిర్మించారు. అవి ట్రాన్సిట్ భవనాలు. ఐకాన్ బిల్డింగ్స్ కట్టడానికి పునాదులు వేసే సరికి జగన్ వచ్చి కూర్చున్నారు. ఈ ఐదేళ్లలో...

ఇక నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ బంద్… ఎందుకంటే..?

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇక నుంచి టీకాను ఉత్పత్తి చేయబోమని స్పష్టం చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు సమర్ధవంతమైన టీకాలు అందుబాటులోకి వచ్చినందున ఇక తమ వ్యాక్సిన్ అవసరం లేదని...

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close